Bollywood: మాస్‌ మహారాజా బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సినిమా రీమేక్‌తోనే ఆరంగేట్రం

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత టాలీవుడ్ హీరోలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో.. మన హీరోల పేర్లు మారుమోగిపోతున్నాయి. టాలీవుడ్ హీరోలు చిన్న రోల్ చేస్తే చాలు అనుకునే స్థితిలో ఉంది బాలీవుడ్. ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2023 | 07:15 PMLast Updated on: Apr 09, 2023 | 7:15 PM

Mass Maharaja Raviteja Entry In Bollywood

ఆ హీరో మరెవరో కాదు.. క్రాక్, ధమాకా, వాల్తేరు వీరయ్య, రావణాసుర అంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో హిట్లు కొడుతూ.. తిరిగి ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ. ఒక రీమేక్ కోసం రవితేజను ఒప్పించేందుకు హిందీ ఫిల్మ్ మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించబోతున్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్. అది కూడా సౌత్ రీమేక్ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు కనిపించబోతున్నారట.

తమిళంలో కలెక్షన్ సునామి క్రియేట్ చేసిన మానాడు సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయ్. కాగా తమిళంలో శింబు నటించిన పాత్రలో వరుణ్‌ చేయగా.. ఎస్‌జే సూర్య చేసిన పాత్రలో రవితేజ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విషయాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయినట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయ్. ఈ సినిమాను రానా, ఏషియన్‌ సునీల్‌తో కలిసి కరణ్‌ జోహర్‌ నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదే నిజమైతే మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అని చెప్పవచ్చు.