ప్రూఫ్స్ చూపించు, నమితకు అధికారులు షాక్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 26, 2024 | 04:47 PMLast Updated on: Aug 26, 2024 | 4:47 PM

Meenakshi Temple Officials Gave A Shock To Namitha

ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమితకు ఘోర అవమానం ఎదురైందట. పండగ రోజున తన కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్తే తనను దారుణంగా అవమానించారని నమిత ఆవేదన వ్యక్తం చేసారు. అసలు ఏం జరిగింది ఏంటీ అనేది ఒకసారి చూస్తే… మధుర మీనాక్షి దేవాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా నమిత వెళ్ళారు. కాని అక్కడి సిబ్బంది మాత్రం ఆమెను లోపలి రానీయలేదు. తనకు స్టార్ ఇమేజ్ ఉన్నా సరే తనను ఇబ్బందికర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారని నమిత వీడియో విడుదల చేసారు.

కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళా అన్నారు ఆమె. కాని అక్కడి సిబ్బంది మాత్రం తనను దేవాలయంలోకి వెళ్ళకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తనకు సంబంధించిన ప్రూఫ్స్ చూపించాలని సిబ్బంది అడగడం తనను ఎంతగానో బాధపెట్టింది అని నమిత ఆవేదన వ్యక్తం చేసారు. తమిళనాడులో మాత్రమే కాకుండా దేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలకు తాను వెళ్ళా అని వాళ్లకు చెప్పినా సరే వినే ప్రయత్నం చేయలేదని నమిత ఆవేదన వ్యక్తం చేసారు. దేవాలయ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనితో మధుర మీనాక్షి దేవాలయ సిబ్బంది స్పందించారు. నమితతో ఎవరూ అమర్యాదగా వ్యవహరించలేదు స్పష్టం చేసారు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడమని అన్నారు. తమకు పై అధికారులు చెప్పడంతోనే కొంత సమయం వేచి చూడాలని కోరినట్టుగా చెప్పారు నమిత. ఆ తర్వాత ఆమెను దేవాలయానికి అనుమతించామని సిబ్బంది స్పష్టం చేసారు. ప్రస్తుతం నమిత చెన్నైలో నివాసం ఉంటున్నారు. వివాహం తర్వాత పెద్దగా నమిత సినిమాలపై ఆసక్తి చూపలేదు. తెలుగులో బిల్లా సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తమిళ సినిమాల్లో నమిత కాస్త ఎక్కువగా కనిపించారు. ప్రస్తుతం కుటుంబంతో నమిత ఎక్కువగా గడుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.