మీరు గొప్పోళ్లు బాస్‌.. సాయంలో మెగా ఫ్యామిలీ రికార్డ్‌..

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం టాలీవుడ్‌ నుంచి హీరోలు భారీ సాయం ప్రకటిస్తున్నారు. ప్రకృతి విపత్తు ఏదైనా సాయంలో ముందుండే మెగా ఫ్యామిలీ.. ఈసారి కూడా పెద్ద మనసు చాటుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2024 | 10:17 PMLast Updated on: Sep 04, 2024 | 10:17 PM

Mega Family Donations To Flood Victims

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం టాలీవుడ్‌ నుంచి హీరోలు భారీ సాయం ప్రకటిస్తున్నారు. ప్రకృతి విపత్తు ఏదైనా సాయంలో ముందుండే మెగా ఫ్యామిలీ.. ఈసారి కూడా పెద్ద మనసు చాటుకుంది. అందరూ కలిసి 8 కోట్ల సాయం చేశారు. జనాలకు అండగా మేము సైతం అంటూ మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా అడుగు వేశారు. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 6 కోట్లు విరాళంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రాంచరణ్ కూడా కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధికి చిరంజీవి, చెర్రీ నుంచి చెరొక కోటి రూపాయలు విరాళం వచ్చాయ్. దీంతో మెగా కుటుంబం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్ల రూపాయలు విరాళం వచ్చినట్టు అయింది. వయనాడ్‌ విపత్తు టైమ్‌లోనూ తండ్రీ కొడుకులు కలిసి.. కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇక పవన్ కల్యాణ్ మొత్తం మీద ఆరు కోట్లు ఇచ్చారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ నుంచి తొమ్మిది కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయ్‌. మెగా ఫ్యామిలీ సాయం చూసి.. అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మీరు గొప్పోళ్లు అంటూ పోస్టులు పెడుతున్నారు. కోటి రూపాయలు విరాళం ఇవ్వడం అంటేనే మాములు విషయం కాదు. అలాంటిది ఒక్క కుటుంబం నుంచి.. 8కోట్లు సాయం రావడం అంటే.. ఇందుకు కదయ్యా మిమ్మల్ని దేవుళ్లు అనేది అంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. నిజానికి అభిమానులకు కానీ, తెలుగు గడ్డకు కానీ ఎలాంటి ప్రమాదం వచ్చినా..విపత్తు వచ్చినా మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. చిరు ప్రతీసారి తన వంతుగా సాయం ప్రకటిస్తూనే ఉంటారు. ఐతే ఇప్పుడు సాయంలో ముగ్గురు పోటీ పడుతున్నారు అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.