Mega Fight: అల్లు VS కొణిదెల.. ఇన్‌స్టా పోస్ట్‌తో నిజం బయటపెట్టిన అల్లు స్నేహ రెడ్డి

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మధ్య స్టార్‌ వార్‌ జరుగుతోందని కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో గాసిప్స్‌ వస్తున్నాయి. స్టార్‌డమ్‌ ప్రూవ్‌ చేసుకునే వార్‌లో ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే బన్నీ చెర్రీ ఒకే దగ్గర కలిసి కనిపించడంలేదు. రీసెంట్‌గా చెర్రీ బర్త్‌ డే పార్టీకి కూడా అల్లు అర్జున్‌ రాలేదు. దీంతో గాసిప్స్‌ డబుల్‌ అయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2023 | 01:30 PMLast Updated on: Apr 01, 2023 | 1:30 PM

Mega Fight Allu Sneha Post In Instagram

నిజానికి అల్లు అర్జున్‌, చెర్రీ చాలా మంచి ఫ్రెండ్స్‌. పేరుకు బావాబామ్మర్దులే అయినా.. రిలేషన్‌కు మించి తమ మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉంటుందని చాలా సందర్భాల్లో చెప్పారు. చాలా ఫంక్షన్స్‌లో వాళ్ల మధ్య ఉన్న అఫెక్షన్‌ను బయటపెట్టారు. కానీ ట్రిపులార్‌ సినిమా తరువాత రామ్‌ చరణ్‌ రేంజ్‌ మారిపోయింది. దీంతో మెగా కాంపౌండ్‌ దాటి అల్లు బ్రాండ్‌ను ఎక్స్‌పోజ్‌ చేసేందుకు బన్నీ ప్రయత్నిస్తున్నాడని కొందరు మాట్లాడుకున్నారు. ఈ ప్రాసెస్‌లోనే బావబామ్మర్దులకు కాస్త గ్యాప్‌ కూడా వచ్చిందంటూ చెవులు కొరుక్కున్నారు.

ఈ కారణంగానే చరణ్‌కు బన్నీ దూరంగా ఉంటున్నాడంటూ చాలా విషయాలు డిసైడ్ చేశారు. కానీ ఒకే ఒక్క పోస్ట్‌తో ఈ రూమర్స్‌ అన్నిటికీ చెక్‌ పెట్టారు అల్లు అర్జున్‌ భార్య స్నేహ రెడ్డి. చిరంజీవి కూతుర్లతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్‌ లేదు అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు. స్నేహ రెడ్డి చేసిన ఈ పోస్ట్‌తో బన్నీ, చెర్రీ మ్యూచువల్‌ ఫ్యాన్స్‌ తెగ కుషీ అవుతున్నారు. సినిమాల్లో బీజిగా ఉన్నారు.. ఒకే దగ్గర కలిసి కనిపించకపోతే బన్నీ చెర్రీకి గ్యాప్‌ వచ్చిట్టేనా అంటూ క్వశ్చన్‌ చేస్తున్నారు. అల్లు, మెగా కుంటుంబాన్ని ఎవరూ విడదీయలేరంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)