Sai Dharam tej : మెగా హీరో ఫిర్యాదు…అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను

సోషల్ మీడియాలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. పిల్లలు, మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 8, 2024 | 09:05 AMLast Updated on: Jul 08, 2024 | 9:18 AM

Mega Heros Complaint Amma Todu I Will Not Leave You

సోషల్ మీడియాలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. పిల్లలు, మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. అలాంటి ఓ యూట్యూబర్ పై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి కోపమొచ్చింది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలను కోరాడు.

ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ తన ఫ్రెండ్స్ తో కలిసి లైవ్ లో మాట్లాడుతూ.. ఒక పసి పాప తన తండ్రితో ఉన్న వీడియోపై దారుణ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రణీత్ పై నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇక ఈ విషయం సాయి తేజ్ దృష్టికి కూడా వెళ్లడంతో ఎక్స్ వేదికగా స్పందించాడు. సోషల్ మీడియా ప్రమాదకరంగా తయారైందని.. మీ పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి అని తల్లిదండ్రులకు సూచించాడు. అలాగే ట్విట్టర్ లో ఉన్న ఆ యూట్యూబర్ వీడియో క్లిప్ కి రిప్లై ఇస్తూ.. “ఫన్ పేరుతో చిన్నారులపై ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం. చిన్నారుల భద్రత గురించి ఆలోచించాలి. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి” అంటూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్ లను ట్యాగ్ చేశాడు.

సాయి తేజ్ తో పాటు మంచు మనోజ్ ,నెటిజెన్లు కూడా గొంత కలుపుతున్నారు. పి హన్మంతు.. నిన్ను వదిలే ప్రసక్తి లేదు.. అమ్మ తోడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మంచు మనోజ్. ఈ పి. హన్మంతు తల్లిదండ్రులు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారట. ఐఏఎస్ అధికారి, జడ్జ్‌లు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హన్ముంతు ఇలాంటి పనులు చేస్తూ కుటుంబ పరువు తీస్తున్నాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.ఆ యూట్యూబర్ అండ్ గ్యాంగ్ ఇలాంటి కామెంట్స్ మొదటిసారి కాదని.. ఎన్నో సార్లు ఇటువంటి కామెంట్స్ చేశారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.