దేవర.. పాదఘట్టం 2గా మిగిలిపోతుందా?

దేవర రిలీజ్ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ట్రైలర్‌ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. బాక్సాఫీస్‌ దగ్గర మాస్ జాతరే అని ఫ్యాన్స్ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఐతే మూవీ చూస్తే మాత్రం ఇది పూర్తిగా ఫాన్స్ మూవీ అని... పబ్లిక్ మూవీ కాదని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 27, 2024 | 07:32 AMLast Updated on: Sep 27, 2024 | 7:32 AM

Mixed Talk For Devara Movie

దేవర రిలీజ్ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ట్రైలర్‌ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. బాక్సాఫీస్‌ దగ్గర మాస్ జాతరే అని ఫ్యాన్స్ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఐతే మూవీ చూస్తే మాత్రం ఇది పూర్తిగా ఫాన్స్ మూవీ అని… పబ్లిక్ మూవీ కాదని తెలుస్తోంది. గ్రాఫిక్స్, సీజీ వర్క్ అంతంత మాత్రంగానే ఉన్నాయఇ దేవర పార్ట్ వన్‌లో పాటలు కాకుండా జాహ్నవి కపూర్ కేవలం ఏడు నిమిషాలే కనిపిస్తుంది. ఆమె యాక్షన్ ఏం బాగోలేదని.. కేవలం పాటలకే పనికి వస్తుందని తెలిసింది. అలాగే విలన్ బాబిడియోల్.. దేవర పార్ట్ వన్‌లో కనిపించడు. కథా బలం కూడా పెద్దగా లేదు. ఎన్టీఆర్ డబుల్ రోల్, షార్క్ చేపతో ఫైట్ అద్భుతం అనుకున్నప్పటికీ… గ్రాఫిక్స్ మాత్రం గొప్పగా లేవని తెలుస్తోంది.

కథ విషయానికొస్తే మూడు మత్స్యకార గ్రామాల మధ్య కథ ఇది. దీనిలో ఒక గ్రామానికి ఎన్టీఆర్ పెద్దగా వ్యవహరిస్తే… మరో గ్రామానికి సైఫ్ అలీ ఖాన్ నాయకుడిగా ఉంటారు. శ్రీకాంత్ మూడో గ్రామానికి పెద్ద. కథ మొత్తం ప్రకాష్‌రాజ్ ద్వారా చెప్పిస్తాడు దర్శకుడు. సముద్రం ద్వారా సప్లై అయ్యే ఆయుధాలను…. ఒడ్డుకు చేరవేసే మత్స్యకార గ్రామాలు మధ్య విభేదాలు, విధ్వంసాలు, పగలు, ప్రతీకారాలు.. కథ ఇదీ. బయట నుంచి వచ్చే ఆయుధాల వల్ల.. దేశంలో తీవ్రవాద శక్తులు పెరుగుతున్నాయని… జనం ప్రాణాలు పోతున్నాయని.. అరాచకం ప్రబలిపోతుందని… ఒక జాలరి గ్రామానికి పెద్ద అయిన దేవర గుర్తిస్తాడు. తాము డబ్బుల కోసం కక్కుర్తి పడితే… దేశమే సర్వనాశనం అవుతుందని, తీవ్రవాద శక్తులు చేతుల్లోకి వెళ్లిపోతుందని తెలుసుకుంటాడు. ఇకనుంచి సముద్రం ద్వారా ఆయుధాలు చేరవేసే పని నిలిపివేయాలన్నది దేవర ఆజ్ఞ. దానిని మిగిలిన ఇద్దరూ ఒప్పుకోరు. అతిక్రమిస్తారు. అప్పుడు దేవర అసలు రూపం చూస్తారు. సముద్రపు నీటిని రక్తం లాగా ఎర్ర రంగు మారుస్తాడు దేవర.

అంత విధ్వంసం సృష్టిస్తాడు. ఇకపై సముద్రం పైకి ఎవరు వెళ్లడానికి ధైర్యం చేయరు. కానీ దేవర మాయమైపోతాడు. అసలు దేవర ఉన్నాడా లేదా అన్నది తెలియదు. కానీ దేవర సముద్రంలోనే ఉన్నాడని… అతనికి కొన్ని శక్తులు ఉన్నాయని… ఒక షార్క్ చాపపై తిరుగుతూ ఉంటాడని… ఆ గ్రామంలో నమ్ముతూ ఉంటారు. కొందరు సముద్రం పైకి వెళ్లాలని ప్రయత్నించి కుక్కచావు చస్తారు. దేవర కొడుకు పెద్దవాడవుతుంటాడు. అతను మరో ఎన్టీఆర్. చాలా అమాయకంగానూ, భయంభయంగాను… కనీసం ఆడపిల్ల కవ్విస్తే సమాధానం చెప్పలేనంత అర్బకుడిగాను ఊర్లో తిరుగుతూ ఉంటాడు. అందరూ అసలు వీడి దేవరకు పుట్టిన కొడుకేనా ఇంత పిరికోడు ఏంటి అని అనుమానం పడుతూ ఉంటారు. చివర్లో మొత్తం అసలు కథ బయట పడుతుంది. అసలు దేవర లేడని… దేవర పరంపరను కొనసాగిస్తూ అతని కొడుకే… ఎవ్వడు సముద్రంపై అడుగుపెట్టిన…. వాళ్లను లేపేస్తూ సముద్రాన్ని కాపాడుతుంటాడని, దేవరే ఆ పని చేస్తన్నాడని అందరికీ భ్రమ కల్పిస్తున్నాడని తెలుస్తుంది. మరి దేవర ఏమయ్యాడు… దేవరని ఎవరు చంపారు అన్నది సెకండ్ పార్ట్‌లో బయటకు రాబోతుంది.

సెకండ్ పార్ట్‌లో బాబిడీయోల్ పాత్ర బయటకి వస్తుంది. మనిషికి బతికే అంత ధైర్యం చాలు… చంపేంత ధైర్యం అవసరం లేదు. కాదు కూడదు అని మీరా ధైర్యాన్ని కూడగడితే… ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. ఈ డైలాగ్ వినడానికి బాగున్నా.. జనానికి మాత్రం గుర్తు ఉండదు. అసలు అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది. ట్రైలర్లో ఈ డైలాగ్ పైనే మొత్తం నడిపించారు. సినిమా మొత్తం ధైర్యము, భయం చుట్టే తిరుగుతాయనేది జనాలకు అప్పుడే అర్థమైపోతుంది.దేవరని సంపాలంటే ఆయన సమయమే కాదు.. సరైన ఆయుధం కూడా దొరకాలా. ఈ డైలాగ్ మాత్రమే జనానికి అర్థం అవుతుంది. అందుకే చిరంజీవి ఆచార్యని అట్టర్ ప్లాప్ చేసిన.. పాదఘట్టం కథ మళ్లీ రిపీట్ అవ్వింది అని ఫ్యాన్స్ నిరాశలో లో వున్నారు. మొదటి పార్ట్ ఇలా చేశాడు ఇక రెండో పార్ట్ ఎలా వుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా.. డైరెక్టర్ కొరటాల శివ క్రియేషన్స్… కొన్నిసార్లు జనం ఊహలకు అందవు.