సమంత చెప్పిందే నిజమయ్యింది!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 8, 2024 | 12:39 PMLast Updated on: Aug 08, 2024 | 12:39 PM

Naga Chaithanya Shobhitha Engagement

నాగ చైతన్య, శోభిత విషయంలో సమంత ఏం చెప్పిందో చివరికి అదే నిజమయ్యింది. ఎవరి వల్ల తన మ్యారీడ్‌ లైఫ్‌ నాశనమయ్యిందని సమంత ఆరోపణలు చేసిందో.. ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు నాగ చైతన్య. నిన్నటి వరకూ సీక్రెట్‌ లవర్స్‌గా ఉన్న శోభిత, నాగ చైతన్య.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌తో హాఫ్‌ కపుల్‌గా మారిపోయారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. నాగ చైతన్యతో వివాదాలు కొనసాగుతున్న టైంలో శోభిత గురించి చాలా సార్లు ఆరోపణలు చేసింది సమంత.

శోభిత వల్లే తనకు చైతన్యకు మధ్య గ్యాప్‌ వచ్చిందని ఆరోపించింది. డైరెక్ట్‌గా శోభిత పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా.. చాలా పోస్టుల్లో తన బాధను ఫ్యాన్స్‌తో పంచుకుంది. సమంత సన్నిహితులు కూడా చాలా సార్లు శోభితను టార్గెట్‌ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. దీంతో చైతన్య సమంత మేటర్‌లో శోభిత కూడా చాలా కాలం ట్రెండ్‌ అయ్యింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న శోభిత.. 2016లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అడవి శేష్‌తో చేస్తున్న ఓ సినిమా షూటింగ్‌లో నాగ చైతన్యకు శోభితకు పరిచయం ఏర్పడింది.

అలా మొదలైన వాళ్ల ఫ్రెండ్‌షిప్‌ లవ్‌గా మారింది. కానీ అప్పటికే 2017లో సమంతను పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య. ఎప్పుడైతే శోభిత చైతన్య లైఫ్‌లోకి వచ్చిందో అప్పటి నుంచి తనకు చైతన్యకు మధ్య గ్యాప్‌ మొదలయ్యిందని సమంత చాలా సార్లు చెప్పింది. కానీ అప్పుడు ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. చైతన్య శోభితకు సంబంధించిన ఫొటోలు ఎన్ని లీకైనా ఈ ఇష్యూ పెద్దగా హైలెట్‌ అవ్వలేదు. సమంతతో విడాకులు తీసుకున్న తరువాత చైతన్య ఓ ఇండోర్‌ పార్టీలో శోభితతో కనిపించాడు. అప్పటి నుంచి వీళ్ల రిలేషన్‌షిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం ప్రారంభమయ్యింది. కానీ ఇద్దరూ ఎప్పుడు ఈ విషయంపై ఎక్కడా రియాక్ట్‌ అవ్వలేదు. ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఫైనల్‌గా ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్పుడు సమంత చెప్పిన మాటలు చేసిన ఆరోపణలను గుర్తు చేసుకుంటున్నారు అందరూ. చివరికి సామ్‌ చెప్పిందే నిజమయ్యింది అంటున్నారు.