Malli Pelli: నరేష్‌ను సాంతం నాకేసిన పవిత్ర లోకేశ్‌.. ఇదేం ఖర్మ అయ్యా నీకు..

బంధాలన్నీ కరెన్సీ కాగితాల చుట్టూ.. ఆ సమయానికి అవసరాలు చుట్టూ తిరుగుతున్న రోజులివి ! అలాంటిది లేటు వయసులో ప్రేమ అంటే.. పెళ్లి అంటే.. అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటాయనుకోవడం అంతా ఉత్త ముచ్చట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 26, 2023 | 03:19 PMLast Updated on: May 26, 2023 | 3:19 PM

Naresh Pavithra Lokesh Malli Pelli

అవసరం, స్వార్థం మాత్రమే ఉంటాయ్. నరేష్‌, పవిత్ర లోకేశ్ బంధం కూడా దాదాపు అదే ! ఆయనకు డబ్బులు ఉన్నాయ్.. ఈమెకు అవసరాలు ఉన్నాయ్.. బంధం మొదలైందని ఆయన అనుకుంటున్నారు.. సెట్ చేశామని ఈమె అనుకుంటోంది. అందుకే సాంతం నాకేస్తోంది.. పరువుతో సహా ! నరేష్‌కు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయ్. తన కష్టం కూడా ఉందని కళ్లద్దాలు పెట్టుకొని మరీ నరేష్ చెప్పినా.. అది నిజం కాదు. ఈ ఆస్తులన్నీ విజయనిర్మల సంపాందించినవే ! అద్దెల రూపంలోనే దాదాపు 8 నుంచి 9 కోట్ల రూపాయలు అద్దెలు వస్తుంటాయ్. ఇంకేం కావాలి.

నరేష్ ప్రస్తుతం 60 ప్లస్ రన్నింగ్‌లో ఉన్నాడు. ముందు ఇద్దరు భార్యలతో విభేదాలు, ఒంటరితనం.. ఇలాంటి పరిస్థితుల మధ్య పరిచయం అయితే పవిత్ర ! ఆయన ఓదార్పు కోరుకున్నాడు. ఈమే ఓ దారి కోరుకుంది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇద్దరి మధ్య బంధం కుదిరింది. తన జీవిత కథకు.. కాస్త మసాలా కలిపి సినిమా తీయాలనుకున్నాడు. అందుకే సొంత డబ్బులతో మూవీ తెరకెక్కించాడు. మళ్లీ పెళ్లి సినిమా తీయడానికి స్వయంగా 9 కోట్ల రూపాయలను.. తన అకౌంట్‌ నుంచి నిర్మాత ఎంఎస్‌ రాజుకు ట్రాన్స్‌ఫర్ చేశాడు నరేష్‌. తన జీవితంలో ఏం జరిగింది అని చెప్పుకోవడం కంటే..పవిత్ర కోసమే ఈ సినిమా తీశాడా నరేష్ అనిపిస్తోంది.

దాదాపు మూడేళ్ల నుంచి పవిత్ర లోకేశ్‌ ఖర్చులన్నీ భరిస్తోంది నరేషే ! కృష్ణ బయోపిక్ తీద్దామని మొదట్లో ప్లాన్ చేశాడు నిజానికి ! విజయనిర్మల, కృష్ణ ప్రధాన పాత్రలుగా…. మూవీ ప్లాన్ చేశాడు. కృష్ణగా తను.. పవిత్రని విజయనిర్మలగా చూపించాలని ఆశించాడు. ఇది తీస్తే కృష్ణ, మహేష్ బాబు ఫాన్స్ వచ్చి.. బొక్కలు చూరాచూరా చేస్తారని సన్నిహితులు హెచ్చరించడంతో.. వెనక్కి తగ్గాడు. తన పెళ్లిళ్లు, ప్రేమలు.. పవిత్ర పెళ్లిళ్లు కథాంశంగా మళ్ళీ పెళ్లి తీశాడు. సినిమా చూపించి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు.

ఇదేమీ కొత్త వివాదం ఉన్న కథ కాదు.. తెలియని స్టోరీ కాదు. కేవలం పవిత్ర ఒత్తిడితోనే ఈ చవకబారు సినిమా తీశాడు నరేష్‌. ఎవరికీ లాభం లేదు.. ఈఇద్దరికీ తెలుసు ఈ విషయం. సినిమా వల్ల మధ్యలో బాగుపడింది ఎంఎస్‌ రాజు మాత్రమే ! పవిత్రకు మొగుడితో సుఖం లేదని.. తన భార్య ఎవరితోనే తిరుగుతుందని.. ఇలాంటి కట్టు కథలన్నీ అల్లి మరీ.. మళ్ళీ పెళ్లి కథ తెరకెక్కించాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ముసలి జంట చేసిన ఓవరాక్షన్‌.. సగటు ప్రేక్షకుడికే కాదు ఇండస్ట్రీ వాళ్లకు కూడా వెగటు పుట్టించాయ్.

ఎండాకాలంలో దసరా పండగేంటి వీళ్లకు అంటూ.. ఘాటుగానే రియాక్ట్ అయ్యారు చాలామంది. ఇదంతా ఎలా ఉన్నా.. నరేష్‌ ఇంటి తాళాలు అన్నీ పవిత్ర లోకేశ్‌ చేతుల్లోకి వెళ్లిపోయాయని ఇండస్ట్రీ టాక్. ఈ మధ్య సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. చానెల్స్‌ స్టూడియోలకు తిరిగిన నరేష్, పవిత్రను చూసిన వాళ్లంతా.. నరేష్‌ పరిస్థితికి జాలిపడ్డారట పాపం. ప్రతీ విషయానికి పవిత్రని బతిమిలాడుకోవడమే సరిపోయిందట నరేష్‌కు. అందరి ముందు ఓపెన్‌గా నరేష్‌ను పవిత్ర బూతులు తిట్టడం.. ఈ మొనగాడు ఆమె కాళ్లవేళ్లా పడడం.. ఇదంతా చూసిన వాళ్లంతా ఇదేం ఖర్మయ్యా నరేష్ నీకు అని జాలిపడడం.. దాదాపు చాలాచోట్ల ఇలాంటి సీనే కనిపించదట. ఎర ఏంటో కానీ.. ఇరుక్కుపోయానని నరేష్‌కు తెలుసు. కానీ బయటకు ఎలా రావాలో తెలియని పరిస్థితి పాపం ఆయనది అని జాలిపడుతున్నారు జనం అంతా.