Nayanthara: నయనతార కూడా సాయి పల్లవిలానే మోసపోయిందా..?

జవాన్‌లో నిజానికి నయనతార పాత్ర గొప్పగా డిజైన్ చేశాడని ఎక్కువ కాల్ షీట్స్ ఇస్తే, బానే సినిమా తీసి, తీరా ఫైనల్ ప్రింట్ టైంలో మాత్రం తన సీన్లకు కత్తెరేశాడట అట్లీ. అలా ఎడిటింగ్‌లో నయనతార పాత్ర తగ్గిపోయింది. విచిత్రంగా జవాన్‌లో షారుఖ్ తండ్రి పాత్రకు వైఫ్‌గా కనిపించిన దీపికా పాత్ర హైలెట్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 21, 2023 | 06:45 PMLast Updated on: Sep 21, 2023 | 6:45 PM

Nayanthara Upset With Atlee For Sidelining Her Role In Jawan Movie

Nayanthara: జవాన్ మూవీ విషయంలో నయనతార మోసానికి గురైంది. నిజంగా అందులో తన పాత్రని కావాలని తగ్గించారని ఫైర్ అవుతోంది. తమిళ దర్శకుడు అట్లీ ఏదో కుర్ర దర్శకుడు కదా అని ఎంకరేజ్ చేస్తే, నయనతార కొంపే ముంచాడట. జవాన్‌లో నిజానికి నయనతార పాత్ర గొప్పగా డిజైన్ చేశాడని ఎక్కువ కాల్ షీట్స్ ఇస్తే, బానే సినిమా తీసి, తీరా ఫైనల్ ప్రింట్ టైంలో మాత్రం తన సీన్లకు కత్తెరేశాడట అట్లీ. అలా ఎడిటింగ్‌లో నయనతార పాత్ర తగ్గిపోయింది.

విచిత్రంగా జవాన్‌లో షారుఖ్ తండ్రి పాత్రకు వైఫ్‌గా కనిపించిన దీపికా పాత్ర హైలెట్ అయ్యింది. తనది నిజానికి గెస్ట్ రోల్. అలాంటిది అట్లీ టీం ఎడిటింగ్ టేబుల్ మీద వేసిన కత్తెర్ల పుణ్యమాని, నయనతార పాత్ర తాలూకు సీన్లు తగ్గిపోయాయట. దీంతో హీరోయిన్ నయనతార కాస్త గెస్ట్ హీరోయిన్ అనేలా సీన్ మారింది. అందుకే ఫస్ట్ ప్రింట్ చూశాక ఫీలైన నయనతార.. ఈ సినిమా సక్సెస్ మీట్‌కి రాకుండా, వీడియో మాత్రమే పంపించింది. తాజాగా తనని కలవాలనుకున్న అట్లీకి ఇంట్లో ఉండి, తను లేనని చెప్పించటం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక గతంలో ఎమ్‌సీఏ మూవీలో సాయి పల్లవి పాత్రని ఇలానే కత్తెరేశారట.

నానిని మించేలా సాయిపల్లవి పాత్ర ఉందని, దీంతో తన సీన్లు తీసేసి, సాయిపల్లవి నొచ్చుకునేలా చేసిందట దిల్ రాజు టీం. దీంతో సాయి పల్లవి దర్శకుడినే కాదు.. దిల్ రాజు మీద కూడా అప్పట్లో అలిగి మరో మూవీ చేసేందుకు నో చెప్పిందనే ప్రచారం జరిగింది.