Nikhil Siddhartha: మెమొరబుల్ మూమెంట్.. తండ్రైన హీరో నిఖిల్.. కొడుకుకి తొలిముద్దు..!

తాజాగా హీరో నిఖిల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. నిఖిల్ భార్య పల్లవి పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. దీంతో హీరో నిఖిల్ ఇంట ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. తాను తండ్రి అయ్యానని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 05:11 PMLast Updated on: Feb 21, 2024 | 5:11 PM

Nikhil Siddhartha And Pallavi Varma Welcome Baby Boy

Nikhil Siddhartha: ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్న హీరోల్లో ఒకరు నిఖిల్ సిద్దార్థ. హిట్టూ.. ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ మూవీతో వెండితెరకు పరిచయమై, మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత యువత, స్వామిరారా, కార్తికేయ, సూర్య vs సూర్య, ఎక్కడికిపోతావు చిన్నవాడ వంటి ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

ALLU ARJUN-ATLEE: గెట్ రెడీ.. అల్లు అర్జున్‌తో అట్లీ.. త్వరలో ప్రకటన

ఇటీవల కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. తాజాగా హీరో నిఖిల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. నిఖిల్ భార్య పల్లవి పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. దీంతో హీరో నిఖిల్ ఇంట ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. తాను తండ్రి అయ్యానని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. దీంతో అభిమానులు, సెలబ్రెటీలు నిఖిల్‌కు విషెస్ తెలిపారు. ఇటీవల కొద్దిమంది సన్నిహితులు, బంధువుల మధ్య నిఖిల్ భార్య.. పల్లవి వర్మ సీమంతం ఫంక్షన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నిఖిల్ సిద్దార్థ-పల్లవి వర్మ కొంతకాలం ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో 2020, మే 14న వివాహబంధంలోకి అడుగు పెట్టారు.

తాజాగా పండంటి మగ బిడ్డ తమ జీవితంలోకి రావడంతో ఈ కపుల్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు కల్పతరువుగా మారాడు హీరో నిఖిల్. ఇటీవల కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయం అందుకున్నాడు. భారీ వసూళ్లు రాబట్టి.. వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్, స్పై మూవీస్ ఊహించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ రెండు చిత్రాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ‘స్వయంభూ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ చిత్ర షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. నిఖిల్ ఇంట వారసుడొచ్చిన విషయం తెలుసుకొని సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.