Sujith : రాజమౌళి వల్లే కాలేదు.. మరీ సుజీత్ కు

ఇప్పటికిప్పుడు రాజమౌళి (Rajamouli) తర్వాత టాలీవుడ్ లో బిగ్ థింగ్ ఎవరా అంటే నలుగురు, ఐదుగురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో సుజీత్ ఒకడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 28, 2024 | 05:40 PMLast Updated on: May 28, 2024 | 5:40 PM

Not Because Of Rajamouli But For Sujeeth

 

 

 

ఇప్పటికిప్పుడు రాజమౌళి (Rajamouli) తర్వాత టాలీవుడ్ లో బిగ్ థింగ్ ఎవరా అంటే నలుగురు, ఐదుగురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో సుజీత్ ఒకడు. రన్ రాజా రన్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుజీత్.. తొలి సినిమాతోనే సూపర్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో సాహో తీసే రేంజ్ కు వెళ్లిపోయాడు. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేశామో కానీ.. సాహో రేంజ్ వేరన్నది చాలా మంది సినీ ప్రియుల అభిప్రాయం. అసలు సుజీత్ ఏం తాగి రాశాడో కానీ.. సాహో స్క్రీన్ ప్లే అసలు నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అంతేకాకుండా రిపీటెడ్ వాల్యూ ఉన్న సినిమాల్లో ఇది కూడా ఒకటని ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ చేయనుండటంతో యావత్ టాలీవుడ్ సుజీత్ వైపు చూస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ లవర్స్ అందరూ ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు. బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే వాళ్ల సంతోషం ఏలా ఉంటుందో.. ఓజీ విషయంలో పవన్ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువే ఆనందంతో ఉన్నారు. ఇన్నాళ్లు రీమేక్ సినిమాలతో చచ్చుబడిపోయిన నాలుకకు, ఓజీ అంటూ అసలైన ఘాటును అంటించాడు సుజీత్.

పవన్ కళ్యాణ్ నుంచి స్ట్రెయిట్ సినిమా వస్తే ఏ రేంజ్‌లో రెస్పాన్స్ ఉంటుందో ఆ మధ్య రిలీజైన టీజర్‌తో స్పష్టం అయింది. ఈ మధ్య కాలంలో ఒక టీజర్‌తో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయంటే అది ఒక్క ఓజీ టీజర్ మాత్రమే. ఇన్నాళ్లుగా పవన్‌ను ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో చూడాలనుకుంటున్నారో.. సుజీత్ అలానే చూపించారు. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే.. తాజాగా సుజీత్ ఓ ఇంటర్వూలో పాజిబుల్ అయితే.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు.

దాంతో సినీ లవర్స్ ఎగ్‌జైట్‌మెంట్ అంతా ఇంతా కాదు. అయితే ఇందులో ఓ చిక్కు కూడా ఉంది. మాములుగానే ప్రభాస్, పవన్ కళ్యాణ్ లకు తెలుగు నాటే కాదు.. యావత్ ఇండియాలో తిరుగులేని క్రేజ్ ఉంది. అలాంటి ఇద్దరిని ఒకే స్క్రీన్‌పై చూపించి ఇద్దరి ఆడియెన్స్‌ను సాటిస్‌ఫై చేయించడం అంటే కత్తి సామే. ఆర్‌ఆర్‌ఆర్‌లో జక్కన్న అటు తారక్‌ను ఇటు చెర్రీని సమంగా చూపించినా.. తారక్ ఫ్యాన్స్‌ తమ హీరోను తక్కువ చేసి చూపించాడని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద చర్చలే జరిగాయి. దాని కోసం రాజమౌళి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి మహామహుడే మల్లీస్టారర్‌ వల్ల అభిమానులను ఫుల్ సాటిస్‌ ఫై చేయలేకపోయాడు. అలాంటిది సుజీత్ చేస్తాడా అనేది అందరిలో ఉన్న డౌటు. అయితే సుజీత్ కేపబులిటీస్ ను అస్సలు తక్కువ అంచనా వేయలం. మరీ ఈ మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కుతుందా అనేది చూడాలి..