Jr. NTR: నందమూరి కుటుంబానికి దూరంగా జూ.ఎన్టీఆర్‌

నందమూరి కుటుంబానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ పూర్తిగా దూరమౌతున్నాడు. మొన్నటి వరకూ బాలకృష్ణ, ఎన్టీఆర్‌ను దూరం పెడితే.. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా ఆ కుటుంబాన్ని దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2023 | 02:55 PMLast Updated on: Aug 28, 2023 | 4:57 PM

Ntr 100 Rs Kalyan Ram Jr Ntr Who Did Not Attend The Event For The Coin Launch

నందమూరి కుటుంబానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ పూర్తిగా దూరమౌతున్నాడు. మొన్నటి వరకూ బాలకృష్ణ, ఎన్టీఆర్‌ను దూరం పెడితే.. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా ఆ కుటుంబాన్ని దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రంలో 100 రూపాయల కాయిన్‌ను రిలీజ్‌ చేశారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ కాయిన్‌ రూపొందించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ కాయిన్‌ రిలీజ్‌ చేశారు. నందమూరి కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హజరయ్యారు. నందమూరి అభిమానులు ఎంతో గర్వంగా ఫీల్‌ అయ్యే ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ వారసుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం హాజరుకాలేదు.

ఎన్టీఆర్‌కు, కళ్యాణ్‌రామ్‌కు ఆహ్వానం ఉన్నా వాళ్లిద్దరూ ఈవెంట్‌కు రాలేదు. దీంతో నందమూరి కుటుంబాన్ని ఇక జూనియర్‌ కూడా పక్కన పెట్టేశారనే టాక్‌ నడుస్తోంది. రీసెంట్‌గా విజయవాడలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్‌ రాలేదు. తెలుగు ఇండస్ట్రీ నుంచి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను స్వయంగా ఆహ్వానించిన బాలకృష్ణ.. ఎన్టీఆర్‌కు మాత్రం ఆహ్వానం పంపలేదు. దీంతో ఆ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ దూరంగా ఉన్నాడు. ఎన్టీఆర్‌ రాకపోవడంతో కళ్యాణ్‌ రామ్‌ కూడా జయంతి ఉత్సవాలకు రాలేదు. అయితే ఇప్పుడు జరిగిన ఈవెంట్‌కు మాత్రం ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ఇద్దరికీ ఇన్విటేషన్‌ అందింది. వాళ్లిద్దరూ ఈవెంట్‌కు వస్తారని అంతా అనుకున్నారు. బాబాయిని అబ్బాయిని ఒకే స్టేజ్‌ మీద చూస్తామని ఫ్యాన్స్‌ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఏమైందో తెలియదు కానీ ఎన్టీఆర్‌ మాత్రం ఈవెంట్‌కు రాలేదు. దీంతో ఎన్టీఆర్‌ కావాలనే ఆ కుటుంబంతో గ్యాప్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నాడు అనే చర్చ మరోసారి మొదలైంది.