కాంతారాలో నటిస్తా, ఎన్టీఆర్ సంచలనం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కన్నడ సినిమాపై కూడా ఫోకస్ చేసాడా...? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా ఎన్టీఆర్ కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ కర్ణాటక వెళ్ళాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 2, 2024 | 11:49 AMLast Updated on: Sep 02, 2024 | 11:49 AM

Ntr Act In Kanntara Chapter 1

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కన్నడ సినిమాపై కూడా ఫోకస్ చేసాడా…? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా ఎన్టీఆర్ కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ కర్ణాటక వెళ్ళాడు. అక్కడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, అక్కడి స్టార్ హీరో రిషబ్ శెట్టితో కలిసి ఎన్టీఆర్ దేవాలయాలకు వెళ్తున్నారు. నిన్న తన తల్లి సొంత ఊరు వెళ్ళిన ఎన్టీఆర్… ఇప్పుడు కొల్లూరు వెళ్ళారు. కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక అక్కడి మీడియాతో ఎన్టీఆర్ మాట్లాడారు. దేవాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్ ను కన్నడ మీడియా పలకరించగా… రిషబ్ శెట్టితో కలిసి పలు దేవాలయాలను సందర్శించడం ఆనందంగా ఉందని అన్నాడు ఎన్టీఆర్. ఆలయంలో సినిమాల గురించి మాట్లాడాలని తాను అనుకోవడం లేదు అన్నాడు. ఇక ఒక విలేఖరి కాంతారా సినిమా గురించి ఎన్టీఆర్ ను ప్రశ్నించాడు. కాంతారాకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 లో మీరు నటిస్తున్నారా అని అక్కడి విలేఖరి ఎన్టీఆర్ ను ప్రశ్నించాడు. జాతీయ మీడియాలో కూడా దీనిపై కథనాలు వస్తున్నాయని అన్నాడు.

దీనిపై స్పందించిన ఎన్టీఆర్… రిషబ్ శెట్టి దాని గురించి ప్లాన్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తే చేయడానికి నేను సిద్దంగా ఉన్నా అంటూ సమాధానం ఇచ్చాడు. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన కాంతారా సినిమా సూపర్ హిట్ అయింది. 16 కోట్లతో విడుదలై ఏకంగా 450 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ప్రీక్వెల్ పై రిషబ్ వర్కౌట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ టూర్ లో కాంతారాపై కూడా చర్చలు జరిగాయని సమాచారం. కాంతారాలో ఎన్టీఆర్ ఉంటే తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని రిషబ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నాడు.