అమ్మ కోసం కొత్త ఇల్లు ప్లాన్ చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తన తల్లి అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. షూటింగ్ ఉన్నా సరే అమ్మకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకునే వెళ్తూ ఉంటాడు ఎన్టీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 1, 2024 | 12:57 PMLast Updated on: Sep 01, 2024 | 12:57 PM

Ntr Has Planned A New House For His Motherఅమ్మ కోసం కొత్త ఇల్ల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తన తల్లి అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. షూటింగ్ ఉన్నా సరే అమ్మకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకునే వెళ్తూ ఉంటాడు ఎన్టీఆర్. తాజాగా అమ్మతో కలిసి కర్ణాటకలోని ఉడుపి ఆలయానికి వెళ్ళాడు ఎన్టీఆర్. అక్కడి శ్రీ కృష్ణుడి ఆలయాన్ని సందర్శించి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఎన్టీఆర్. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

“అమ్మ ఎప్పుడూ నన్ను తన సొంత ఊరు కుందాపురాతోపాటు, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనానికి వెళదామని అడుగుతుంటుందని… ఇప్పుడు ఆమె కల నెరవేరింది అంటూ… సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి ఇదే అని పోస్ట్ చేసాడు. ఇక ప్రముఖ నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ కు.. ధన్యవాదాలు చెప్పాడు. అలాగే నా ప్రియమిత్రుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది… అలాగే రిషబ్‌శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు అని పోస్ట్ లో పేర్కొన్నాడు ఎన్టీఆర్.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన తల్లికి బిగ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేసాడు. సొంత ఊరు కుందాపురలో అమ్మ కోసం ఒక ఇల్లు కట్టేందుకు రెడీ అయ్యాడు ఎన్టీఆర్. ఇందుకోసం ఒక స్థలం కూడా వెతికినట్టుగా సమాచారం. తన స్నేహితుడు రిషబ్ శెట్టి ద్వారా ఆ ఇంటి స్థలం కొనుగోలు చేసి అనంతరం అత్యాధునిక సౌకర్యాలతో అమ్మ కోసం అక్కడ ఒక ఇంటిని నిర్మించాలని భావిస్తున్నాడట. ఎప్పుడైనా అమ్మకు అక్కడికి వెళ్ళాలనే కోరిక కలిగినప్పుడు ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉండి వస్తారని రిషబ్ తో ఎన్టీఆర్ చెప్పాడట. త్వరలోనే ఈ ఇంటి పనులను కూడా ఎన్టీఆర్ మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం.