మ్యాన్ ఆఫ్ మాసెస్ కి… మ్యాన్ ఆఫ్ బోల్డ్ నెస్ కి సెట్టైందా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆల్రెడీ కొరటాల శివ మేకింగ్ లో దేవరగా ఈ మంత్ ఎండ్ బాక్సాఫీస్ కి బ్యాండ్ వేయబోతున్నాడు. హిందీ మూవీ వార్ 2 లో విలనీ రోల్ వేస్తున్నాడు. ఆతర్వాత ఏంటనగానే సీన్ లోకి ప్రశాంత్ నీల్ పేరొచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 10, 2024 | 02:15 PMLast Updated on: Sep 10, 2024 | 2:15 PM

Ntr With Sandeep Reddy Vanga

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆల్రెడీ కొరటాల శివ మేకింగ్ లో దేవరగా ఈ మంత్ ఎండ్ బాక్సాఫీస్ కి బ్యాండ్ వేయబోతున్నాడు. హిందీ మూవీ వార్ 2 లో విలనీ రోల్ వేస్తున్నాడు. ఆతర్వాత ఏంటనగానే సీన్ లోకి ప్రశాంత్ నీల్ పేరొచ్చింది. తన డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడని తేలిపోయింది. సినిమా కూడా లాంచ్ అయ్యింది. వాట్స్ నెక్ట్స్ అన్నదగ్గనే సీన్ మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంది. సడన్ గా ఊహించని కాంబినేషన్ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. రెబల్ స్టార్ తో సినిమా ప్లాన్ చేసిన దర్శకుడే ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడా? సలార్ డైరెక్టర్ లానే యానిమల్ డైరెక్టర్ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ కి కనెక్ట్ అయ్యాడా? చూసేయండి.

ఎన్టీఆర్ ని వాడుకుంటే, తను వేసే పాత్రతో ఆడకుంటాడు అంటారు. ఆరేంజ్ పెర్ఫార్మర్ అయిన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ కి, సాలిడ్ కధ, పాత్ర, వాటిని తెరకెక్కించే డైరెక్టర్ పడితే, బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఆవిషయం త్రిబుల్ ఆర్ తో ప్రూవ్ అయ్యింది. దేవరతో మరోసారి రుజువుకాబోతోంది.

ఇంతలో సీన్ లోకి సందీప్ రెడ్డి వంగ రాగానే సీనే మారిపోయింది. బేసిగ్గా డార్క్ మూడ్ ని హై ఇంటెన్సిటీ ఎమోషన్స్ నిచూపిచటంతో సందీప్ రెడ్డి వంగ ఎక్స్ పర్ట్… అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లో పూర్తిగా హీరో సెంట్రిక్ గానే సినిమా నడిపించాడు. ఓరకంగా పూరీ స్టైల్లో హీరో పాత్రని, రాజమౌళి స్టైల్లో లార్జర్ స్కేల్ లో మేకింగ్ కి, ఇక సుకుమార్ స్టైల్లో హీరో లోని వైడ్ యాంగిల్ ని చూపిస్తాడు సందీప్ రెడ్డి వంగ్..

అలా ముగ్గురు దర్శకులని కలిపితే తాను అన్నట్టుండే, ఈడైరెక్టర్ సడన్ గా కర్ణాటకలో ఎన్టీఆర్ ని కలిశాడు. ఏదో అక్కడ రిషబ్ శెట్టితో తారక్ కలిసి టెంపుల్ టూర్ వేస్తుంటే ఈ ఇద్దరు కలిశారంటున్నారు. కాని రియాలిటీ మాత్రం పక్కా పర్ఫెక్ట్ రీజన్ తోనే వీళ్ల మీటింగ్ జరిగిందట.

లేదంటే రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డికి, కర్ణాటకాలో ఎన్టీఆర్ ని కలవాల్సిన అవసరం ఏముంది?.. అక్కడే మ్యాటర్ క్లియర్ అవుతోంది. ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి స్టోరీ డిస్కర్షన్ మీద క్లారిటీ వస్తోంది. ఐతే ప్రభాస్ తో సంక్రాంతికి స్పిరిట్ ని సెట్స్ పైకి తీసుకెళుతున్న సందీప్, ఆతర్వాత యానిమల్ సీక్వెల్ తీస్తాడు. కాకపోతే యానమిల్ 2 మూవీ హిందీలో రణ్ బీర్ రామాయణం 3 భాగాల సినిమా వల్ల డిలే అయ్యేలా ఉంది. అందుకే స్పిరిట్ తర్వాత ఎన్టీఆర్ మూవీ ని లైన్లో పెడుతున్నాడట సందీప రెడ్డి వంగ. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సందీప్ సినిమా ఎనౌన్స్ అయినా, తన ప్లానింగ్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి, సందీప్ కూడా తన ప్లానింగ్ లో తాను ఉన్నట్టున్నాడట.