Naga chaitanya: నాగచైతన్యను కార్తీతో రీప్లేస్‌ చేసిన పరశురామ్‌!?

నిఖిలి హీరోగా యువత అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన డైరెక్టర్‌ పరశురామ్‌. చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. వరుసగా గీతగోవిందం, సర్కారువారి పాట హిట్లతో స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు. నాగచైతన్యతో నాగేశ్వర్‌రావు సినిమా ప్లాన్‌ చేసిన పరశురామ్‌ ఇప్పుడు రూట్‌ మార్చి కార్తీని లైన్‌లో పెట్టాడు. కార్తీతో సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 14, 2023 | 01:46 PMLast Updated on: May 14, 2023 | 1:46 PM

Parashuram Replace The Karthi In Nagachaitanay

స్క్రిప్ట్‌కు పూజ చేయించేందుకు వచ్చిన పరశురామ్‌ మీడియాతో ఈ న్యూస్‌ షేర్‌ చేసుకున్నాడు. రీసెంట్‌గా కస్టడీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య పరశురామ్‌ మీద అసహనం వ్యక్తం చేశాడు. పరశురామ్‌ తన టైం మొత్తం వేస్ట్‌ చేశాడని.. అతని గురించి నా దగ్గర మాట్లాడకండీ అంటూ సీరియస్‌ అయ్యాడు. నాగ చైతన్య రియాక్షన్‌ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయ్యింది. ఇప్పుడు చైతన్యను పూర్తిగా పక్కనపెట్టి కార్తీతో సినిమా తీస్తున్నా అంటూ మరోసారి వార్తల్లో నిలిచాడు పరశురామ్‌.

గీతగోవిందం హిట్‌ తరువాత నాగచైతన్యతో ఓ సినిమా ప్లాన్‌ చేశాడు పరుశురామ్‌. దాని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ చేశాడు. నాగేశ్వర్‌రావు టైటిల్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పాడు. కానీ సడెన్‌గా మహేష్‌తో సర్కారువారి పాట సినిమా తీశాడు. ఆ సినిమా తరువాత చైతన్యతో సినిమా స్టార్ట్‌ చేస్తాడు అనుకున్నారంతా. కానీ వాళ్లిద్దరూ ప్లాన్‌ చేసిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

స్క్రిప్ట్‌ విషయంలో ఇద్దరిక అభిప్రాయబేధాలు రావడంతో స్క్రిప్ట్‌ కాస్త చేంజ్‌ చేయాలని చైతన్య చెప్పాడట. దానిక ఒకే అన్నట్టుగానే ఉన్నా స్క్రిప్ట్‌ చేంజ్‌ చేసేందుకు పరశురామ్‌ ఇష్టపడలేదట. ఈ కారణంగానే సినిమాను ఆపేశారంటూ టాక్‌. వీళ్లిద్దరి సినిమా ఆగిపోయిన విషయం హాట్‌ టాపిక్‌గా ఉండగానే.. కార్తీతో సినిమా తీస్తున్నానంటూ మరో షాకిచ్చాడు పరశురామ్‌. అయితే చైతన్య కోసం రాసిన కథనే కార్తీతో తీస్తున్నాడా.. లేక వేరే కొత్త తీస్తున్నాడా అనేది మాత్రం పరశురామ్‌ క్లారిటీ ఇవ్వలేదు.