Prabhas:ఇన్ని ట్రోలింగ్స్‌ మధ్య ఆదిపురుష్‌ డౌటేనా

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రామయణం అధారంగా వస్తున్న ఆదిపురుష్‌ స్టార్టింగ్‌లోనే పల్టీ కొడుతోంది. ముందు నుంచీ ఈ సినిమాకు విపరీతమైన ట్రోలింగ్‌ వస్తుంది. సినిమాలో రాముడు, హనుమాన్‌, రావణాసురుడి లుక్స్‌ విషయంలో ఫ్యాన్స్‌ చాలా అంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 31, 2023 | 08:30 AMLast Updated on: Mar 31, 2023 | 8:30 AM

Prabhas Aadipurush Movie

మీరు తీసే కథకి మీరు చూసిస్తున్న క్యారెక్టర్స్‌కు ఏమైనా సంబంధం ఉండా అని అడగని ప్రభాస్‌ ఫ్యాన్‌ లేడు. ఫ్యాన్సే ఇలా అడుగుతున్నారంటే నార్మల్‌ పీపుల్‌ ఏ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడో వచ్చిన టీజర్‌ నుంచి ఇప్పుడు వచ్చిన పోస్టర్‌ దాకా ఆదిపురుష్‌కు ట్రోల్స్‌ వస్తూనే ఉన్నాయి. రాముడికి మీసాలేంటి అని క్వశ్చన్‌ చేయ్యనివాళ్లు లేరు. అయితే ఇన్ని ట్రోలింగ్స్‌ మధ్య ఆదిపురుష్‌ రిజల్ట్‌ ఎలా ఉండబోతోందని అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి లాంటి నెవర్‌ బిఫోర్‌ సినిమా తరువాత వరుస ఫ్లాప్స్‌ ఫేస్‌ చేశాడు ప్రభాస్‌. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అంతా ఆదిపురుష్‌ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. 500 కోట్లతో ఓం రౌత్‌ సినిమా తీస్తున్నాడు అనగానే.. వాహ్‌ బాహుబలి రికార్డ్స్‌ బ్రేక్‌ అనుకున్నారు. కానీ టీజర్‌తో ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు ఓం రౌత్‌. రామయణం గురించి ఓ అవగాహన లేకుండా క్యారెక్టర్స్‌ను డిజైన్‌ చేశాడు. రాముడికి మీసాలు ఉండటం.. రాక్షసుడైన రావణాసురుడు స్టైలిష్‌గా ఉండటంతో చిర్రెత్తిపోయి అంతా ఓ రేంజ్‌లో వేసుకున్నారు. దీంతో కొంత గ్యాప్‌ తీసుకున్న మేకర్స్‌.. ఇప్పుడు ఫ్యాన్స్‌ను కూల్‌ చేసేందుకు పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

కానీ ఈ పోస్టర్‌ ఆ టీజర్‌ కంటే దారుణంగా ఉండటంతో ఇంకో రౌండ్‌ వాయించేశారు. ఇక మా వల్ల కాదు.. ఈ సినిమాను థియేటర్‌లో చూసే ధైర్యం లేదు ఓటీటీకి ఇచ్చేయండి అని తేల్చేశారు. దీంతో ఆదిపురుష్‌ కష్టమే అంటున్నారు క్రిటిక్స్‌. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా విషయంలో ఇంత కేర్‌లెస్‌గా ఉండటం ఓం రౌత్‌ తప్పేనని తేల్చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ మధ్య జూన్‌ 16న రిలీజ్‌ కాబోయే ఆదిపురుష్‌ ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుందో చూడాలి.