Mahesh : మహేశ్‌కు ప్రభాస్‌ సీన్ రిపీట్..

బాహుబలి (Baahubali), ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ (Bollywood) ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్, సూపర్ స్టార్‌ మహేశ్ బాబు కాంబోలో రాబోయే మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2024 | 01:30 PMLast Updated on: Mar 10, 2024 | 1:30 PM

Prabhas Scene Repeat For Mahesh

బాహుబలి (Baahubali), ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ (Bollywood) ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్, సూపర్ స్టార్‌ మహేశ్ బాబు కాంబోలో రాబోయే మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. గుంటూరు కారంలో మూవీతో భారీ కలెక్షన్లు రాబట్టిన మహేష్‌ బాబు.. జక్కన్న (Jakkanna) తో మూవీపై ఫుల్ కాన్సన్‌ట్రేషన్ పెట్టారు. SSMB 29 అనే పేరుతో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇక..ఈ మూవీ గురించి రెగ్యులర్ గా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన వినిపిస్తోన్న ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాజమౌళి మూవీ అంటే మామూలుగా ఉండదు.. జక్కన్న డైరెక్షన్‌లో నటించే హీరోలకు ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కుతుంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివాళ్లు పాన్ ఇండియా (Pan India) ట్యాగ్ సొంతం చేసుకోగా, మహేశ్ ఈ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ హీరో అవ్వడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతోంది.

దీనిని రెండు పార్టులుగా తీసే అవకాశం లేకపోలేదని ఇప్పటికే రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఒక హింట్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ రెండు పార్టుల కోసం మొత్తంగా జక్కన్న ఐదేళ్ళ సమయాన్ని లాక్ చేసినట్లు చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన అనంతరం వీలైనంత త్వరగా రెండవ పార్ట్ ని కూడా మొదలెడతారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు ఫిలిం వర్గాల్లో హాట్‌టాపిక్గా మారింది.. అటు.. మహేశ్‌ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. బాహుబలి రెండు పార్టుల కోసం ప్రభాస్‌ను లాక్ చేసిన జక్కన్న.. డార్లింగ్‌కు వరల్డ్ వైడ్‌గా ఏ రేంజ్‌లో క్రేజ్‌ తీసుకొచ్చాడో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు మహేశ్‌ మూవీని రెండు పార్టులుగా తీయబోతున్న జక్కన్న.. అంతకు మించి మహేశ్‌ను ప్రొజెక్టు చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది.

దీంతో… హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గని లుక్ ఉన్న మహేశ్‌బాబు క్రేజ్.. ఈ మూవీతో ఆకాశమే హద్దుగా ఎదిగిపోవడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే ఇప్పటివరకు వైరల్ అవుతున్న ఈ వార్తలు అన్ని కూడా ప్రచారంలో ఉన్నవే తప్ప టీమ్ నుండి మాత్రం ఇంకా వీటిపై ఎటువంటి క్లారిటీ లేదు. సో.. మరి.. SSMB 29 మూవీపై వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మూవీ టీమ్ ఇచ్చే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వరకు వేచి చూడాల్సిందే..