Priyamani: మొత్తం డ్రామానే.. డబ్బులిచ్చి అలా చేయించుకుంటారు..!

సెలబ్రిటీలను వెంటపడి ఫోటోలు తీసే బ్యాచ్‌ని పపరాజీ అని కూడా పిలుస్తారు. అయితే నిజంగా బాలీవుడ్‌ సెలబ్రిటీలకు అంత క్రేజ్ ఉందా.. జిమ్‌కి వెళ్లిన ప్రతీ సారీ అలా వెంటపడి ఫోటోలు తీసేంత ఖాళీగా మీడియా వాళ్లు ఉన్నారా.. తాజాగా దీనిపై సంచలన విషయాలు బయటపెట్టింది ప్రియమణి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2024 | 05:31 PMLast Updated on: Feb 20, 2024 | 5:31 PM

Priyamani Reveals About Photographs About Bollywood Stars

Priyamani: బాలీవుడ్ సెలబ్రిటీలు, సెలబ్రిటీల కిడ్స్ ఎక్కడికి వెళ్లినా కొన్ని కెమెరాలు వాళ్లను ఫాలో అవుతూ ఉంటాయి. చిట్టి పొట్టి నిక్కర్లలో జిమ్‌కి వెళ్లినా, ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటికి వచ్చినా, ఆఖరికి బాత్రూమ్‌ నుంచి బయటికి వచ్చినా టపా టపామని ఫోటోలు క్లిక్ చేస్తూనే ఉంటారు మీడియా వాళ్లు. ఇలా సెలబ్రిటీలను వెంటపడి ఫోటోలు తీసే బ్యాచ్‌ని పపరాజీ అని కూడా పిలుస్తారు. అయితే నిజంగా బాలీవుడ్‌ సెలబ్రిటీలకు అంత క్రేజ్ ఉందా.. జిమ్‌కి వెళ్లిన ప్రతీ సారీ అలా వెంటపడి ఫోటోలు తీసేంత ఖాళీగా మీడియా వాళ్లు ఉన్నారా.. తాజాగా దీనిపై సంచలన విషయాలు బయటపెట్టింది సౌత్ నటి ప్రియమణి.

Samantha Ruth Prabhu: విడిపోయాక ప్రశాంతంగా ఉంది.. సామ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ మూవీ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ మూవీలో 1, 2, 3, 4 సాంగ్‌కి డ్యాన్స్ చేసిన ప్రియమణి, ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌‌లోనూ నటించింది. ప్రస్తుతం ‘భామా కలాపం 2’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ప్రియమణి, ‘బాలీవుడ్ సెలబ్రిటీలు, స్టార్ కిడ్స్ బయటికి రాగానే వారిని ఫోటోలు తీసేందుకు చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఫోటోలు తీసినందుకు వారికి బాలీవుడ్‌ వాళ్లే డబ్బులు ఇస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పైగా అక్కడ అది కల్చర్ అని.. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా అది మొదలైందన్నారు. కొంతమంది డబ్బులిచ్చి మరీ ఫోటోలు తీయించుకుంటున్నారంట’ అంటూ చేసిన సెన్సేషన్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలు వచ్చిన టైంను ముందుగానే సోషల్ మీడియా కెమెరామెన్లకు సమాచారం ఇస్తారని.. పైగా పనైపోయాక వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారని అసలు నిజం చెప్పింది.

అంతేకాక పీఆర్‌లు చాలా వరకు డబ్బులు నొక్కేస్తారని.. బాలీవుడ్లో ఈ సంస్కృతి ఎక్కువగా ఉందని చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. మొత్తానికి ఇలా సోషల్ మీడియాలో తమ వీడియోలను వైరల్ చేస్తూ.. ఇంకా క్రేజ్ పెంచుకుంటున్నారు బాలీవుడ్ స్టార్స్. స్టార్స్‌కు ఉండే క్రేజ్‌తో కాకుండా డబ్బులిస్తేనే అలా వచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తారనే విషయం మొత్తానికి ప్రియమణి ద్వారా బయటకు వచ్చింది.