Pushpa 3 : ‘పుష్ప3’గుట్టుగా మొదలెట్టేసారు భయ్యా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే.. ఉత్తరాదిని కూడా ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో బన్నీ ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది.. పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మేనరిజం కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించిపెట్టింది. ఈ మూవీతో బన్నీ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2024 | 09:00 AMLast Updated on: Mar 07, 2024 | 9:26 AM

Pushpa 3 Started As A Bunch Bhaiyya

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే.. ఉత్తరాదిని కూడా ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో బన్నీ ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది.. పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మేనరిజం కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించిపెట్టింది. ఈ మూవీతో బన్నీ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఈ మూవీలోని అద్భుతమైన యాక్టింగ్‌కు గాను. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డును సాధించాడు. తెలుగులో ఈ ఘనతను సాధించిన తొలి నటుడిగానూ రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో.. పుష్ప-2 మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆగస్ట్ లో ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత అద్భుతంగా ఉంటుందని సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు.. తొలి భాగంలో పుష్పరాజ్ ప్రాంతీయ స్థాయిలో కనిపిస్తే, ఈ సినిమాలో ఆయన రేంజిలో ఇంటర్నేషనల్ లెవల్ లో ఉంటుందన్న టాక్ పార్ట్‌-2 పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇలాంటి టైమ్‌లో ‘పుష్ప3’ అల్లు అర్జున్ సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని కన్‌ఫామ్ చేశాడు. బెర్లిన్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో పుష్ఫ-3 బన్నీ క్లారిటీ ఇచ్చాడు. దీంతో… పు ష్ఫ-3 సీక్వెల్ పై ఇప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక.. పుష్ప-3 గురించి లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ఏమిటంటే.. పుష్ప 3 కి సంబందించిన కొన్ని సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పుష్ప 3 కి సంబందించిన కొన్ని సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారట.. అయితే.. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ.. ఈ వార్త మాత్రం బన్నీ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరో వైపు పుష్ఫ-2 ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌తో గూస్ బంప్స్ రావడం ఖాయమని మేకర్స్‌ పక్కాగా చెబుతున్నారు. ప్రజెంట్ పుష్ప-2పై క్రియేట్ అయిన బజ్‌ చూస్తుంటే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.. అదే జరిగితే.. నెక్ట్స్ రాబోయే పాన్ ఇండియా మూవీలకు పుష్ఫరాజ్ సరికొత్త టార్గెట్‌లను ఫిక్స్ చేసినట్లే అంటున్నారు ట్రేడ్ పండితులు..