Adipurush: ఆదిపురుష్ కోసం రంగంలోకి.. రామ్ చరణ్, రణ్ బీర్ కపూర్ అండ్ కో..

ఆదిపురుష్ మూవీ కోసం ఒక్కో హీరో రంగంలోకి దిగుతున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ ఏకంగా 10 వేల టిక్కెట్లు బుక్ చేసి పేద పిల్లలు, అనాథలకు పంచిపెడుతున్నాడు. ఇలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పదివేల టిక్కెట్లు బుక్ చేసి తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు పంచిపెడుతున్నాడనంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 9, 2023 | 04:42 PMLast Updated on: Jun 09, 2023 | 4:42 PM

Ram Charan And Ranveerkapoor Favor To Adipurush

ఇలాంటి విచిత్రాలు ఎన్నో ఆదిపురుష్ విషయంలో జరుగుుతున్నాయి. సెన్సార్ బోర్డ్ అయితే సింగిల్ కట్టింగ్ లేకుండా యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక శాండిల్ వుడ్ స్టార్ యష్ కూడా ఆదిపురుష్ పదివేల టిక్కెట్లు బుక్ చేసి పేద పిల్లలకు పంచిపెట్టే కార్యక్రమానికి సిద్దమయ్యాడట.

మలయాళంలో ఫ్రుధ్వీరాజ్ కూడా ఇదే పనిచేయబోతున్నాడు. ఓరకంగా సలార్ లోవిలన్ గా నటిస్తున్నమాలయాల నటుడు ఫ్రుధ్వీరాజ్ ప్రభాస్ మీద అభిమానంతో ఇలా అక్కడి పేద పిల్లలకు పదివేల టిక్కెట్లు పంచిపెట్టబోతున్నాడట. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో రాఖీ భాయ్ గా ఫోకసైన యష్ కూడా ప్రభాస్ తో ఉన్న స్నేహం కారణం అదే పనిచేస్తున్నాడు. తమిళ నాడులో ఆదిపురుష్ కోసం హీరో సూర్య పదివేల టిక్కెట్ల బుక్కింగ్ కి రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఇలా ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఆదిపురుష్ పదివేల టిక్కెట్లు బుక్ చేసి పేద పిల్లలకు, అనాథలకు ఈ సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిప్పుడో ట్రెండ్ గా మారుతోంది.