Rangasthalam: మెగా పవర్ స్టార్ ర్యాంపేజ్.. 6 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘రంగస్థలం’

చ‌ర‌ణ్ కెరీర్‌లో 100 కోట్ల షేర్ అందుకున్న మొద‌టి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రం చ‌ర‌ణ్ మార్కెట్‌ను అమాంతం పెంచింది. చరణ్‌ కెరీర్‌లో ఎన్ని బ్లాక్‌బస్టర్‌ సినిమాలున్నా రంగస్థలం మాత్రం ప్రత్యేకం. చిట్టిబాబుగా చరణ్‌ నటిన వర్ణనాతీతం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2024 | 03:57 PMLast Updated on: Apr 01, 2024 | 3:57 PM

Ram Charans Rangasthalam Completed Six Years Fans Celebrating

Rangasthalam: ఆరేళ్ల కిందట వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. రామ్‌చరణ్ చిట్టిబాబుగా, క్రియేటీవ్‌ జీనియస్‌ సుకుమార్‌ రూపొందించిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అప్పటివరకు ఉన్న లోకల్ రికార్డులన్నీ చెరిపేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. నటుడిగా రామ్‌చరణ్‌ను మరో స్థాయిలో నిలబెట్టింది. అప్పటివ‌ర‌కు చ‌ర‌ణ్ న‌ట‌న‌ను విమ‌ర్శించిన‌వారే ఈ మూవీలో చ‌ర‌ణ్ న‌ట‌న‌కు జేజేలు కొట్టారు. చ‌ర‌ణ్ తన న‌ట‌న‌తో ప్రేక్షకుల‌ను థియేటర్ల‌కు మ‌ళ్ళీ మ‌ళ్ళీ వ‌చ్చేలా చేశాడు.

Kurchi Madathapetti: వైరల్ వీడియో.. టెక్సాస్‌ ఈవెంట్‌లో ‘కుర్చీని మడత పెట్టి’కి డ్యాన్సులు..

చ‌ర‌ణ్ కెరీర్‌లో 100 కోట్ల షేర్ అందుకున్న మొద‌టి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రం చ‌ర‌ణ్ మార్కెట్‌ను అమాంతం పెంచింది. చరణ్‌ కెరీర్‌లో ఎన్ని బ్లాక్‌బస్టర్‌ సినిమాలున్నా రంగస్థలం మాత్రం ప్రత్యేకం. చిట్టిబాబుగా చరణ్‌ నటిన వర్ణనాతీతం. ఈ సినిమాతో చరణ్‌కు తిరుగులేని పాపులారిటీ వచ్చింది. ఇక సుక్కు టేకింగ్‌కు అయితే ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ‘రంగ‌స్థలం’ మూవీకి రూ.80.36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. 82 కోట్ల‌తో బ్రేక్ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ మూవీ ఫైన‌ల్‌గా 122.47 కోట్ల క‌లెక్షన్ల‌ను సాధించి నాన్-బాహుబ‌లి రికార్డును సాధించింది. ఈ చిత్రం కొన్న బ‌య్యర్లకు రూ.40 కోట్ల వ‌ర‌కు లాభాలు వ‌చ్చాయి. ఇక ఈ చిత్రంతో రామ్‌చ‌ర‌ణ్ యూఎస్ బాక్సాఫీస్ ద‌గ్గర 2మిలియ‌న్‌, 3మిలియ‌న్ మార్కును అందుకున్నాడు. ఫైన‌ల్‌గా ఈ చిత్రం రూ.216 కోట్ల గ్రాస్ క‌లెక్షన్ల‌ను సాధించి ఆ ఏడాది అత్యధిక వ‌సూళ్ళు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

AP Volunteers: ఏపీలో ఫించన్లు ఆపిందెవరు..? అసలేం జరిగింది..?

అసలు ‘రంగస్థలం’ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసుంటే రికార్డులు తిరగరాసేదని ఇప్పటికీ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ఆడియెన్స్ సైతం అనుకుంటుంటారు. ఆ కథలో అలాంటి దమ్ముంది మరీ. కాగా తాజాగా ఈ సినిమా ఆరేళ్లు పూర్తి చేసుకుంది. అలాంటిది ఇప్పుడీ కాంబో మరోసారి చేతులు కలపడంతో అప్పుడే ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్ కు వెళ్లిపోయాయి. పైగా పుష్పతో సుకుమార్ క్రేజ్ కూడా దక్షిణాదిన ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక చరణ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దక్షిణాదిన ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గేమ్ చేంజర్ కోసం మనమెంత ఈగర్ గా వేయిట్ చేస్తున్నామో.. నార్త్ ఆడియెన్స్ సైతం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

అలాంటిది ఇప్పుడు ఇద్దరు చేతులు కలుపుతున్నారంటే సంభవమే అని సినీ లవర్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ తో బిజీగా ఉన్న సుకుమార్.. అది పూర్తి కాగానే, రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను మొదలు పెట్టనున్నాడు. ఇక ఈ సినిమా అలా అనౌన్స్‌మెంట్ చేశారో లేదో, ‘ఆర్ఆర్ఆర్’ టైమ్ లో జక్కన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అదేంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్న టైమ్ లో, రామ్ చరణ్, ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి చెప్పాడట. అది విన్న రాజమౌళి మైండ్ బ్లాక్ అయిందట.