Malli Pelli Movie: నరేష్‌, పవిత్రకు రమ్య రఘుపతి షాక్

సినిమాలో మ్యాటర్‌ ఉందో లేదో కానీ.. మళ్లీ పెళ్లి గురించి పెరుగుతున్న హీట్ మాత్రం అంతా ఇంతా కాదు. పవిత్రను త్వరలో పెళ్లిచేసుకోబోతున్నానని ప్రకటించిన నరేష్.. ఎక్కడికి వెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2023 | 02:00 PMLast Updated on: May 25, 2023 | 2:00 PM

Ramya Raghupathi Pitition On Family Court

హగ్‌లు, కిస్సులు.. సెంటిమెంట్‌ డైలాగులు.. మాములుగా లేదు వ్యవహారం అంతా ! మళ్లీ పెళ్లి ప్రమోషన్‌లో భాగంగా దాదాపు అన్ని చానెల్స్ చుట్టేస్తున్నారు. ఐతే రెండో భార్య రమ్య రఘుపతితో నరేష్‌కు ఇంకా అధికారికంగా విడాకులు కాలేదు. దీంతో ఆమె ఏం చేయబోతున్నారు.. నరేష్‌ మళ్లీ పెళ్లి కథ ఎలాంటి మలుపు తిరగబోతుందనే చర్చ.. ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ మొదలైంది. మళ్లీ పెళ్లి తన బయోపిక్ కాదు అని నరేష్ పదేపదే చెప్తున్నా.. టీజర్, ట్రైలర్‌లో కనిపించిన కొన్ని సీన్లు.. నరేష్ నిజ జీవితంలో జరిగినవే కావడంతో.. సినిమాలో ఏముందనే ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

ముఖ్యంగా ఆ హోటల్ సీన్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిణామాల మధ్య నరేష్‌, పవిత్రకు రమ్య రఘుపతి షాక్ ఇచ్చారు. విడుదలకు ముందు రోజే.. మళ్లీ పెళ్లి చిత్రయూనిట్‏కు రమ్య పెద్ద ఝలక్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు రమ్య రఘుపతి. తన ఇమేజ్‌ను దెబ్బతీసేలా, కించపరిచేలా చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపించారు. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది.. మూవీ విడుదల అవుతుందా ఏం జరగబోతుందనే చర్చ మొదలైంది. మళ్లీ పెళ్లి సినిమా మీద నరేష్ సూపర్‌ కాన్ఫిడెన్స్ మీద కనిపిస్తున్నారు.

కృష్ణ బతికుంటే.. తనను కచ్చితంగా మెచ్చుకొని తీరేవారు అంటూ ఇంటర్వ్యూల్లో కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఆపినా.. ఆపాలకున్నా.. సినిమా విడుదల ఆగేది లేదని పదేపదే చెప్తున్న నరేష్‌కు.. ఇప్పుడు రమ్య రఘుపతి ఫిర్యాదుతో షాక్ తగిలినట్లు అయింది.