Raviteja: రవితేజ.. గోపీచంద్ మలినేని.. ఈ సారి అంతకు మించి.. సినిమా నేపథ్యం ఇదే..!

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడు రవితేజ. తనకి సూపర్ హిట్స్ అందించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడట. రవితేజ-గోపిచంద్ మలినేని కాంబో ఏ రేంజ్‌లో ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2023 | 04:21 PMLast Updated on: Nov 21, 2023 | 4:21 PM

Raviteja And Gopichand Malineni Movie Will Go Floors Soon

Raviteja: స్టోరీస్ సెలక్షన్‌లో ఆచితూచి అడుగేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ధమాకాతో కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ చూసిన రవితేజ ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు అంటూ వచ్చాడు. ఆ మూవీ ఫలితం కాస్త అటు ఇటు అయినా త్వరలో రానున్న ఈగల్‌తో సక్సెస్ కొడతానంటున్నాడు. లేటెస్ట్‌గా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రవితేజ. మాస్ మహారాజ రవితేజ కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కూడా అందులో స్టోరీ డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. అందుకే హిట్టు-ఫ్లాపుతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో దూసుకుపోతున్నాడు.

Trisha Krishnan: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు..

ఈ మధ్యే టైగర్ నాగేశ్వర రావు సినిమాతో వచ్చాడు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్లలో కన్నా టైగర్ నాగేశ్వర రావు మూవీ ఓటీటీలో జైలర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను వెనక్కి నెట్టేసి దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈగల్ మూవీతో బిజీగా ఉన్నాడు మాస్ మహారాజ్. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ మూవీ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడు రవితేజ. తనకి సూపర్ హిట్స్ అందించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడట. రవితేజ-గోపిచంద్ మలినేని కాంబో ఏ రేంజ్‌లో ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన డాన్ శ్రీను, బలుపు, క్రాక్ మంచి హిట్టందుకున్నాయి.

ఇప్పుడు నాలుగోసారి ఈ కాంబోలో మూవీ అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రాబోతుందట. సీమ లాంగ్వేజ్‌లో మాస్ మహారాజ్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉండబోతోందట. ఈ మేరకు సీమ మాండలికంపై శిక్షణ తీసుకోబోతున్నాడట రవితేజ. రియల్ స్టోరీ ఆధారంగానే ఈ మూవీ తెరకెక్కనుందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను వచ్చే ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతి బరిలో దిగనుంది.. ఈ చిత్ర షూటింగ్ పూర్తైన వెంటనే గోపీచంద్‌తో మూవీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి రవితేజ ప్లానింగ్ చూస్తుంటే మరోసారి ఫ్యాన్స్‌కి ధమాకానే.