Sai Dharam Tej: మామకు తగ్గ అల్లుడు.. సాయి ధరమ్‌ తేజ్‌ గొప్ప నిర్ణయం..

సాయి ధరమ్‌ తేజ్‌ కూడా తన మేనమామ బాటలో నడుస్తున్నాడు. ఎప్పుడూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ.. అసోసియేషన్స్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేయిస్తుంటాడు సాయి ధరమ్‌ తేజ్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 1, 2023 | 02:50 PMLast Updated on: Mar 01, 2023 | 2:50 PM

Sai Dharam Tej Teaser Release Postponed Due To Death Of A Fan

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. హీరోలపై అభిమానులకే కాదు.. అభిమానులంటే హీరోలకు కూడా చెప్పలేనంత ప్రేమ ఉంటుందని మరోసారి నిరూపించాడు. తన అభిమాని చనిపోయాడన్న విషయం తెలియడంతో.. తన సినిమా టీజర్‌ రిలీజ్‌ను వాయిదా వేశాడు.

సుకుమార్‌ డైరెక్షన్‌లో సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్తా మీనన్‌ హీరోహీరోయిన్లుగా విరూపాక్ష సినిమా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ ఇప్పటికే రిలీజైంది. ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. మార్చ్‌ 1న విరూపాక్ష టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ యూనిట్‌ ప్రకటించింది. కానీ భీమవరం సాయి ధరమ్‌తేజ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావూరి పండు అనుకోకుండా చనిపోయారు. ఈ విషయం తెలియడంతో వెంటనే టీజర్‌ రిలీజ్‌ను పోస్ట్‌ఫోన్‌ చేశాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఈ విషయాన్ని సినిమా ప్రొడక్షన్‌ సంస్థ SVCC తన అఫిషియల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపింది.

ముందు నుంచీ మెగా కుటుంబం మొత్తం ఫ్యాన్స్‌కు మంచి ప్రియారిటీ ఇస్తారు. వీళ్లలో పవన్‌ కళ్యాణ్‌ అయితే మరీ ఎక్కువ. తాను బతికేదే ఫ్యాన్స్‌ కోసం అన్నట్టుగా వాళ్ల కోసం రోడ్డెక్కుతుంటాడు. అందుకే పవర్‌ స్టార్‌కు ఆ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్‌ కూడా తన మేనమామ బాటలో నడుస్తున్నాడు. ఎప్పుడూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ.. అసోసియేషన్స్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేయిస్తుంటాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఇప్పుడు అభిమానికి సంతాపం తెలిపేందుకు టీజర్‌ పోస్ట్‌ఫోన్‌ చేయడంతో అంతా సాయి ధరమ్‌ తేజ్‌ను మెచ్చుకుంటున్నారు. మామకు దగ్గ అల్లుడు అంటూ పొగుడుతున్నారు.