Salar : సలార్ స్నేహితుడి ప్రేమకథ ..

ప్రస్తుతం ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయ్యింది. బాహుబలి తరువాత హిట్ ఖాతా తెరవని ప్రభాస్.. ఆ రేంజ్ హిట్ కోసం సలార్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డుల పునాదులను పెకిలించి ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, ప్రభాస్ స్నేహితుడిగా నటించిన మలయాళీ నటుడు పృథ్విరాజ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 05:42 PMLast Updated on: Dec 23, 2023 | 5:42 PM

Salars Friends Love Story

ప్రస్తుతం ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయ్యింది. బాహుబలి తరువాత హిట్ ఖాతా తెరవని ప్రభాస్.. ఆ రేంజ్ హిట్ కోసం సలార్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డుల పునాదులను పెకిలించి ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, ప్రభాస్ స్నేహితుడిగా నటించిన మలయాళీ నటుడు పృథ్విరాజ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మలయాళ సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా పాత్రలు పోషిస్తూ.. తన వర్సటైల్ యాక్టింగ్‌తో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్.

తన కెరీర్‌లో ఎక్కువగా మలయాళ చిత్రాల్లోనే నటించాడు. అందుకే ఆ భాష సినిమాలు చూసే మూవీ లవర్స్‌కు పథ్విరాజ్ పేరు సుపరిచితమే. కానీ ‘సలార్’లాంటి పాన్ ఇండియా మూవీలో వరధరాజా మానార్ పాత్రలో నటించిన తర్వాత సౌత్ ప్రేక్షకులకు తను మరింత దగ్గరయ్యాడు. పృథ్విరాజ్ సుకుమారన్‌కు 24 ఏళ్లు ఉన్నప్పుడే ‘వాస్తవం’ అనే సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడిగా ‘కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్’ అందుకున్నాడు. అంత చిన్న వయసులో ఈ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి హీరో పృథ్విరాజ్. యూనివర్సిటీ ఆఫ్ టస్మానియాలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఒక ఆడిషన్‌లో పాల్గొని ‘నందనం’ అనే చిత్రంలో నటించడానికి ఛాన్స్ కొట్టేశాడు.

ఈ మూవీ 2002లో విడుదలయ్యింది. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా సక్సెస్ సాధించిన తర్వాత 2019లో డైరెక్షన్‌లోకి ఎంటర్ అయ్యాడు పృథ్విరాజ్ సుకుమారన్. మోహన్‌లాల్ హీరోగా ‘లూసీఫర్’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసి తాను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. కేవలం 21 రోజుల్లోనే రూ.150 కోట్ల కలెక్షన్స్ సాధించి.. అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన మలయాళ చిత్రంగా ‘లూసీఫర్’ రికార్డ్ సాధించింది. ఇంకా ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ తెరకెక్కనున్నాయి. బీబీసీ ఇండియాలో రిపోర్టర్‌గా పనిచేసిన సుప్రియా మీనన్‌‌‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011 ఏప్రిల్ 25న పాలక్కాడ్‌లో కేవలం బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 2014లో వారికి ఒక పాప పుట్టింది. పాన్ ఇండియా వైడ్ గా దూసుకెళ్తున్న సలార్ మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో, రెండో పార్ట్ మీద కూడా మంచి హైప్ ఏర్పడింది.