Salman Khan: పరువు తీస్తున్న సల్మాన్ ఖాన్.. తిట్లు తింటున్న ప్రభాస్!

ఆ పాట మరీ దిక్కుమాలిన లిరిక్స్‌తో, అంతకంటే దిక్కుమాలిన డాన్స్‌లతో రోత పుట్టిస్తోంది. ఎంతగా సౌత్‌ని రిప్రెసెంట్ చేయాలన్నా, ఆ పంచెకట్టులో మరీ అంత దిక్కుమాలిన స్టెప్స్ వేయాలా అని సల్మాన్‌తోపాటు వెంకీని కూడా ట్రోల్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2023 | 06:23 PMLast Updated on: Apr 20, 2023 | 6:23 PM

Salman Khan And Prabhas Got Trolling

Salman Khan: సల్మాన్ ఖాన్ పరువు తీస్తున్నాడు. తనతో పాటు తెలుగు స్టార్ విక్టరీ వెంకటేష్‌తో కలిపి సినిమా పరువే కాదు, పాటల పరువు కూడా తీస్తున్నారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో పంచెకట్టుతో ఓ సాంగ్ చేశాడు సల్మాన్ ఖాన్. రైమ్స్‌ని పాటగా మలిచాడు తెలుగు మ్యూజిషియన్ దేవిశ్రీ ప్రసాద్.

అంతా సౌత్ మార్కెట్ కోసమే చేశారు. అంతవరకు బానే ఉంది. కాని, ఆ పాట మరీ దిక్కుమాలిన లిరిక్స్‌తో, అంతకంటే దిక్కుమాలిన డాన్స్‌లతో రోత పుట్టిస్తోంది. ఎంతగా సౌత్‌ని రిప్రెసెంట్ చేయాలన్నా, ఆ పంచెకట్టులో మరీ అంత దిక్కుమాలిన స్టెప్స్ వేయాలా అని సల్మాన్‌తోపాటు వెంకీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ విషయానికొస్తే ఈ హీరో చేయని తప్పుకి అటు ఫ్యాన్స్ నుంచి ఆగ్రహం, ఇటు సినీ జనం నుంచి ట్రోలింగ్‌ని ఫేస్ చేయాల్సి వస్తోంది. ఆదిపురుష్ అప్‌డేటెడ్ టీజర్ అంటూ రీసెంట్‌గా ఓ ప్రోమో వదిలింది ఫిల్మ్ టీం. మొదట్లో వచ్చిన టీజర్‌లో గ్రాఫిక్స్ బాలేదనే సరికి, 6 నెలలు టైం తీసుకునీ మరీ గ్రాఫిక్స్ మారుస్తున్నారు.

అలా మార్చి కొత్త టీజర్ వదులుతున్నామన్నారు. కట్ చేస్తే కొత్త టీజర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అదే చెత్త గ్రాపిక్స్ తప్ప కొత్తగా ఏం లేదు. దీంతో గ్రాఫిక్స్ రిపేర్లన్నారు.. యాజ్ ఇట్ ఈజ్ వదిలారు.. ఇలానే వదిలేటట్టైతే ఎందుకు సినిమాను వాయిదా వేసి అంచనాలు పెంచారంటూ నెటీజన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ కోపం కాస్త ప్రభాస్ మీద చూపిస్తున్నారు ఆడియెన్స్. దీంతో ఆదిపురుష్ టీజర్ మీద మీమ్స్‌తో కొత్తగా ట్రోలింగ్ పెరిగింది.