SANDEEP REDDY VANGA: యానిమాల్ ఎటాక్.. బాలీవుడ్ మీద కామెంట్లతో సందీప్ రెడ్డి దాడి?

ఓటీటీలో చూశారో ఏమో కాని, కొందరు బాలీవుడ్ స్టార్స్ కామెంట్లు పెంచారు. కంగనా తన మూవీ మీద నెగెటివ్ రివ్యూ ఇచ్చినా, తన సినిమాలో కంగనాని తీసుకోవటానికి తనకేం ఇబ్బంది లేదన్నాడు సందీప్ రెడ్డి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2024 | 03:27 PMLast Updated on: Feb 06, 2024 | 3:27 PM

Sandeep Reddy Vanga Attack To Bollywood Film Makers About Animal

SANDEEP REDDY VANGA: యానిమల్ వచ్చింది. వసూళ్ల వరద తెచ్చింది. ఆ ఎపిసోడ్ అయిపోయిందనుకున్నారు. కాని కామెంట్లు, ట్రోలింగ్స్, కౌంటర్ ఎటాక్స్‌తో ఇంకా యానిమల్ వేడి తగ్గలేదు. రూ.900 కోట్ల వసూళ్ల దగ్గర ఆగిన ఈమూవీ కేవలం వెయ్యికోట్లకు వందకోట్ల దూరంలోనే ఆగాల్సి వచ్చింది. అయినా ఓటీటీలో కూడా ఈ మూవీకి మతిపోగొట్టే వ్యూవర్‌షిప్ వచ్చింది. ఆ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ గురించి ఓటీటీ సంస్థకూడా ఎనౌన్స్ చేసింది.

MAHESH BABU: రాజమౌళి సినిమా తర్వాత ఇమేజ్ డ్యామేజ్ కాకుండా మహేశ్ ప్లానింగ్

అంతా బాగుందనుకుంటే, ఓటీటీలో చూశారో ఏమో కాని, కొందరు బాలీవుడ్ స్టార్స్ కామెంట్లు పెంచారు. కంగనా తన మూవీ మీద నెగెటివ్ రివ్యూ ఇచ్చినా, తన సినిమాలో కంగనాని తీసుకోవటానికి తనకేం ఇబ్బంది లేదన్నాడు సందీప్ రెడ్డి. కాని సందీప్ మూవీలో తను నటిస్తే, ఆల్ఫామేల్ పాత్రలు స్త్రీ వాదులుగా మారిపోతారు. కాబట్టి సందీప్ తనకి అవకాశం ఇవ్వకండంటూ సెటైర్ వేసింది కంగనా. ఇక బాలీవుడ్ దివంగత నటుడు, ఇర్ఫాన్ ఖాన్ సతీమణి కూడా ఓవర్ రేటెడ్ మూవీ యానిమల్ అనేసింది. ఇంచుమించు ఇలానే బాలీవుడ్ లిరిసిస్ట్ జావెద్ అక్తర్ రియాక్ట్ అయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన సందీప్ రెడ్డి వంగ, జావెద్ అక్తర్ ఓసారి తన కొడుకు ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మీర్జా పూర్ వెబ్ సీరీస్ చూడలన్నాడు.

ఒకరిని తప్పు పట్టే ముందు తమ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చాడు. ఓరకంగా ఇది సాలిడ్ కౌంటర్ అన్న మాటే వినిపిస్తోంది. యానిమల్ వచ్చి వసూళ్ల వర్షం కురిపించి నెలలు గడుస్తున్నా, బాలీవుడ్ లో మాత్రం కామెంట్ల జోరు ఆగట్లేదు. సందీప్ రెడ్డి ఎటాక్ లో కూడా ఎలాంటి మార్పు లేదు.