SSMB 29: రాజమౌళి-మహేశ్ సినిమా ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే అనౌన్స్‌మెంట్

మహేష్ బాబు సినిమా అనౌన్స్మెంట్ రోజే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఇండియానా జోన్స్ రేంజ్‌లో సినిమా తీస్తున్నానని, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ మూవీ అని చెబుతూ వస్తున్నాడు జక్కన్న.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2024 | 04:01 PMLast Updated on: Apr 24, 2024 | 4:01 PM

Ss Rajamouli And Mahesh Babu Movie Announcement Date Fixed

SSMB 29: ఆర్ఆర్ఆర్ సినిమా కథ గురించి ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి.. ఆడియెన్స్ ఓ అంచనాకు వచ్చేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాను కూడా ఇదే విధంగా మొదలు పెట్టబోతున్నాడు జక్కన్న. అనౌన్స్మెంట్ రోజే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఇండియానా జోన్స్ రేంజ్‌లో సినిమా తీస్తున్నానని, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ మూవీ అని చెబుతూ వస్తున్నాడు జక్కన్న.

Rakul Preet Singh: కొత్త పోస్ట్.. పార్లమెంట్‌కి రకుల్ ప్రీత్ సింగ్

ఇదే విషయాన్ని అధికారిక ప్రకటన రోజు మరింత క్లియర్‌గా చెప్పే అవకాశముంది. అయితే.. అదిగో, ఇదిగో అంటున్నారు కానీ, ఎస్ఎస్ఎంబీ 29 అనౌన్స్‌మెంట్ ఎప్పుడు..? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. లేటెస్ట్‌గా మాత్రం డేట్ లాక్ అయినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్న రాజమౌళి.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున గ్రాండ్‌గా అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అనౌన్స్మెంట్‌కి సంబంధించి.. జక్కన్న అండ్ టీమ్ ఒక వీడియోని కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. మరో నెల రోజుల్లో టాలీవుడ్ నుంచి రానున్న హాలీవుడ్ అనౌన్స్‌మెంట్ మాత్రం సంచలనంగా మారనుంది.

ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. హీరోయిన్‌గా ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ పేరు వినిపిస్తోంది. అలాగే విలన్‌గా స్టార్ హీరోని తీసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తునే ఉన్నాయి. మరి.. ఈసారి రాజమౌళి ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.