SSMB29: మహేశ్-రాజమౌళి మూవీ.. కీలక విషయాలు చెప్పిన నిర్మాత

ఇలాంటి టైమ్‌లో SSMB 29కి సంబంధించి నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. SSMB 29 ప్రాజెక్ట్ కోసం నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎంతో ఆసక్తి నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2024 | 02:17 PMLast Updated on: Apr 21, 2024 | 2:17 PM

Ss Rajamouli Movie With Mahesh Babu Producer Announced Key Details

SSMB29: ద‌ర్శక ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కాంబినేషన్‌లో వ‌స్తోన్న క్రేజీ ప్రాజెక్టు ఎస్‌ఎస్‌ఎంబీ 29. ఈ మూవీ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ డ్రామాతో.. హై టెక్నికల్ వాల్యూస్‌తో రాబోతుంద‌ని టాక్‌. పాన్ వరల్డ్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. టీమ్‌ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. దీంతో.. ఈ మూవీకి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది.

RAM CHARAN: 1000 మందితో రామ్ చరణ్ ఫైట్.. మైండ్‌బ్లోయింగ్ సీక్వెన్స్..

ఇలాంటి టైమ్‌లో SSMB 29కి సంబంధించి నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. SSMB 29 ప్రాజెక్ట్ కోసం నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎంతో ఆసక్తి నెలకొంది. ఈమూవీకి సంబంధించి ప్రముఖ నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు SSMB 29 మూవీ స్టోరీ తెలుసునని, ఇటీవల టీమ్‌తో కలిసి డిస్కషన్స్‌లో పాల్గొన్నానన్నారు. అయితే మూవీ పక్కాగా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, షూటింగ్‌కి ఎన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మాత్రం రాజమౌళికి మాత్రమే తెలుసంటూ ఫ్యాన్స్‌కు ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ మూవీపై జక్కన్న ఎంతో కేర్‌ తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మూవీకి సంబంధించి టీమ్ నుంచి పూర్తి క్లారిటీ వచ్చే వరకు.. ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూ ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేశారు. కాగా.. అమెజాన్ అడవుల నేపథ్యంతో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మహేశ్‌ బాబు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైంటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.

మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని కామన్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందంటూ మొన్నటివరకు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రం 2025 మేలో సెట్స్ పైకి వెళ్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనుల కోసం మహేశ్‌బాబు, రాజమౌళి అండ్‌ టీమ్‌ కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో మహేశ్ న్యూ లుక్​తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు. ప్రిన్స్ మ‌హేష్‌బాబు పొడవాటి జుట్టు, గడ్డంతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. ఇక.. జక్కన్న మ‌హేశ్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.