ssmb 29: జపాన్‌ ప్రేక్షకులకు రాజమౌళి గ్రేట్‌ ప్రామిస్‌.. ఖుషీలో మహేష్ ఫ్యాన్స్ !

ఒక థియేటర్‌లో స్క్రీనింగ్‌ సందర్భంగా జపాన్‌ ప్రేక్షకులను ఉద్దేశించి రాజమౌళి మాట్లాడుతూ ‘నా నెక్స్‌ట్‌ మూవీ మొదలైంది. స్క్రిప్ట్‌కి సంబంధించిన వర్క్‌ కంప్లీట్‌ అయింది. ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు. కేవలం హీరోని మాత్రమే ఎంపిక చేశాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2024 | 03:48 PMLast Updated on: Mar 19, 2024 | 3:48 PM

Ss Rajamouli Soft Launches Mahesh Babu In Japan At Rrr Screening

ssmb 29: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా వస్తోందంటే సినిమా లవర్స్‌ ఆ సినిమా గురించే ఎదురుచూస్తూ ఉంటారు. ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా ఎంతో హ్యాపీగా ఫీల్‌ అవుతారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రిలీజ్‌ అయి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఆ సినిమా ఫీవర్‌ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ సినిమా స్క్రీనింగ్‌ జపాన్‌లో ప్రారంభమైంది. దీనికి రాజమౌళి దంపతులు హాజరై అక్కడి ప్రేక్షకుల్ని ఉత్సాహపరిచారు.

Mahesh : మహేష్, రాజమౌళి సినిమాలో విలన్ గా స్టార్ హీరో!

ఈ సందర్భంగా వారిని కలుసుకొని పలు విషయాల గురించి వారితో ముచ్చటించారు. ఒక థియేటర్‌లో స్క్రీనింగ్‌ సందర్భంగా జపాన్‌ ప్రేక్షకులను ఉద్దేశించి రాజమౌళి మాట్లాడుతూ ‘నా నెక్స్‌ట్‌ మూవీ మొదలైంది. స్క్రిప్ట్‌కి సంబంధించిన వర్క్‌ కంప్లీట్‌ అయింది. ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు. కేవలం హీరోని మాత్రమే ఎంపిక చేశాం. అతని పేరు మహేష్‌బాబు. తెలుగు యాక్టర్‌. మీలో చాలామందికి అతను పరిచయమే. మహేష్‌ చాలా అందగాడు. వీలైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్‌ టైమ్‌లో మహేష్‌ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను’ అని వారికి ప్రామిస్‌ చేశారు.

రాజమౌళి జపాన్‌ ప్రేక్షకులకు చేసిన ఈ ప్రామిస్‌ గురించి తెలుసుకున్న మహేష్‌ ఫ్యాన్స్‌ చాలా హాపీగా ఫీల్‌ అవ్వడమే కాదు, ఎమోషనల్‌ అవుతున్నారు. తమ అభిమాన హీరోని జపాన్‌ తీసుకెళ్ళి వారికి పరిచయం చేస్తానని చెప్పడం వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్‌ బాగా వైరల్‌ అవుతోంది.