SSMB29 : మహేష్ కోసం ఆ ఇద్దరినీ రీప్లేస్

ఆర్ఆర్ఆర్ (RRR) తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిచెప్పారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (Rajamouli). ఈ భారీ స‌క్సెస్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుతో ఆయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇక‌.. గుంటూరు కారం (Guntur kaaram) లాంటి మాస్ మ‌సాలా మూవీ త‌ర్వాత జ‌క్క‌న్న‌తో భారీ మూవీకి ఫిక్స‌య్యాడు మ‌హేశ్.. వీళ్లిద్ద‌రి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీపై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2024 | 02:53 PMLast Updated on: Feb 06, 2024 | 2:53 PM

Star Director Ss Rajamouli Is Going To Replace These Two For Mahesh

ఆర్ఆర్ఆర్ (RRR) తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిచెప్పారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (Rajamouli). ఈ భారీ స‌క్సెస్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుతో ఆయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇక‌.. గుంటూరు కారం (Guntur kaaram) లాంటి మాస్ మ‌సాలా మూవీ త‌ర్వాత జ‌క్క‌న్న‌తో భారీ మూవీకి ఫిక్స‌య్యాడు మ‌హేశ్.. వీళ్లిద్ద‌రి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీపై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా జ‌క్క‌న్న చెక్కబోతున్న ఈ మూవీని హాలీవుడ్ (Tollywood) రేంజ్‌లో తెర‌కెక్కించేందుకు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో న్యూ లుక్‌తో క‌నిపించిన మ‌హేశ్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేశాడు. ఈ టైమ్‌లోనే ఈ మూవీ గురించి మ‌రొక‌ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ మూవీకి సంబంధించి ఇద్ద‌రిని జ‌క్క‌న్న రిప్లేస్ చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

సాధార‌ణంగా త‌న సినిమాల‌కు సంబంధించి రాజ‌మౌళికి టెక్నీషియ‌న్స్ మార్చే అల‌వాటు లేదు.. కానీ.. SSMB29 మూవీలో మాత్రం ఇద్ద‌రు టెక్నీషియ‌న్స్‌ను మార్చిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.. ఈ మూవీ కోసం కెమెరా మ్యాన్ గా కేకే సెంథిల్ కుమార్ ప్లేస్ లో పీఎస్ వినోద్ ని అలానే విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా కమల కన్నన్ ని తీసుకుంటున్నట్లు ఫిలిం వ‌ర్గాలు అంటున్నాయి.. గతంలో రాజమౌళి తీసిన చాలా సినిమాలకు పనిచేసిన కమల కన్నన్, ఇటీవల ఆర్ఆర్ఆర్ కి మాత్రం వర్క్ చేయలేదు. అలానే కేకే సెంథిల్ కుమార్ మాత్రం వరుసగా ఆయనతో వర్క్ చేస్తూ వస్తున్నారు.. మ‌రి.. ఇప్పుడు వీల్లిద్ద‌రినీ జ‌క్క‌న్న రీప్లేస్ చేశార‌న్న న్యూస్ వైర‌ల్ అవుతోంది…

కాగా.. SSMB 29 మూవీ అతి త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు రానుంది.. పాన్ వరల్డ్ గ్లోబ్ (Pan World Globe) ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెర‌కెక్కించ‌నున్నారు.. అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కావాల్సిన ఈ మూవీ గురించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జక్కన్న అండ్ టీమ్ ప్రారంభించిందట. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న.. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించ‌నున్నారు.