The Kerala Story: ది కేరళ స్టోరీ డైరెక్టర్‌కు యాక్సిడెంట్‌.. ప్రమాదమా.. హత్యాయత్నమా..

దేశవ్యాప్తంగా వివాదాస్పదమౌతున్న ది కేరళ స్టోరీ డైరెక్టర్‌ సుదీప్తో సేన్‌ ప్రమాదానికి గురయ్యారు. ఆయనతో పాటు కారులోనే ఉన్న హీరోయిన్‌ అధా శర్మకు కూడా గాయాలయ్యాయి. వీల్లిద్దరూ ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వాళ్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వెంటనే వాళ్లను సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్‌కు తరలించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 14, 2023 | 06:50 PMLast Updated on: May 15, 2023 | 7:44 PM

The Kerala Story

ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు. అనేక వివాదాలకు కారణమౌతున్న ది కేరళ స్టోరీ సినిమా హీరోయిన్‌, డైరెక్టర్‌కు యాక్సిడెంట్‌ అవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నిజానికి ఈ మూవీ టీం కరీంనగర్‌లో జరుగుతున్న హిందూ ఏక్తా యాత్రకు రావాల్సి ఉంది. కానీ యాక్సిడెంట్‌ కారణంగా యాత్రకు హాజరు కాలేకపోతున్నానంటూ మూవీ టీం ట్వీట్‌ చేసింది.

లవ్‌ జిహాదీ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన ది కేరళ స్టోరీ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ట్రైలర్‌తోనే వివాదాలు ఫేస్‌ చేసిన ఈ సినిమాకు వ్యతిరేకంగా చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగియా. వెస్ట్‌ బెంగాల్‌ ప్రభుత్వం ఏకంగా సినిమాను బ్యాన్‌ చేసింది. తమిళనాడు ప్రభుత్వం షోలు రద్దు చేసింది. మూవీ మేకర్స్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో వెస్ట్‌ బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఇక తమిళనాడు ప్రభుత్వంతో మూవీ మేకర్స్‌ స్వయంగా కలిసి మాట్లాడారు. ఇలా మొత్తంగా చాలా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన కేరళ స్టోరీ సినిమాలో కీలకమైన డైరెక్టర్‌, హీరోయిన్‌కు యాక్సిడెంట్‌ జరగడం హాట్‌ టాపిక్‌గా మారింది.