Pavitra : మా అమ్మను వాళ్లే చంపేశారు.. పవిత్ర కూతురు సంచలన పోస్ట్‌

త్రినయని (Trinayani) సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించికున్న పవిత్ర జయరాం.. రీసెంట్‌గా రోడ్‌ యాక్సిడెంట్‌లో చనిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2024 | 12:03 PMLast Updated on: May 15, 2024 | 12:03 PM

They Killed My Mother Holy Daughter Sensational Post

 

 

 

త్రినయని (Trinayani) సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించికున్న పవిత్ర జయరాం.. రీసెంట్‌గా రోడ్‌ యాక్సిడెంట్‌లో చనిపోయింది. కర్నాటకలోని తన స్వగ్రామానికి వెళ్లి వస్తుండగా పవిత్ర కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో పవిత్ర (Pavitra) అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త చంద్రకాంత్‌ (Chandrakant) కూడా కారులోనే ఉన్నాడు. ఆయనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ఈ క్రమంలో పవిత్ర కూతురు ప్రతీక్ష సోషల్‌ మీడియాలో ఓ సంచలన పోస్ట్‌ పెట్టింది. నా తల్లిని చంపేసింది వాళ్లే.. కొంచెం కూడా జాలి లేదా అంటూ పోస్ట్‌ పెట్టింది. తన తల్లి లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఎమోషనల్‌ అయ్యింది. ప్రతీక్ష పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కర్నాటకలోని స్వగ్రామానికి వెళ్లి వస్తున్న సమయంలో పవిత్ర కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్‌ పవిత్ర కారును ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు డివైడర్‌ మీదకు ఎక్కేసింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు పవిత్ర భర్త చంద్రకాంత్‌ కూడా కారులోనే ఉన్నాడు. చంద్రకాంత్‌ పరిస్థితి చూసిన పవిత్రకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది.

దీంతో అక్కడికక్కే ఆమె చనిపోయింది. చంద్రకాంత్‌కు కాలు, చెయ్యి ఫ్యాక్చర్‌ అయ్యింది. ఆయన అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయాడు. పవిత్ర చనిపోయిన విషయం తరువాతి రోజు సాయంత్రం చంద్రకాంత్‌కు తెలిసింది. దీంతో చంద్రకాంత్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. భార్యను తల్చుకుంటూ ఆయన కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. నువ్‌ లేవన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా.. ప్లీజ్‌ వెనక్కి వచ్చేయ్‌ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇదిలా ఉంటే బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్‌ జరిగిందంటూ ప్రతీక్ష ఇప్పుడు పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. డ్రైవర్‌ కాస్త అప్రమత్తంగా ఉంటే పవిత్ర ప్రాణాలతో ఉండేదని అంతా కామెంట్స్‌ చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.