గుంటూరు కారం సెన్సార్ పూర్తి.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

ఈ సారి సంక్రాంతిని మాస్ ఘాటుతో నింపేందుకు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు రెడీ అయిపోయారు. మహేశ్ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరు కారం ఈనెల 12న సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాలతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 13 ఏళ్ల త‌ర్వాత ఈ క్రేజీ కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాపై.. విప‌రీత హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ రేసులో చాలా సినిమాలు ఉండ‌టంతో ఒక‌వేళ వాయిదా ప‌డుతుందా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 5, 2024 | 10:55 AMLast Updated on: Jan 05, 2024 | 10:55 AM

This Time Superstar Mahesh Babu Is Ready To Fill Sankranthi With Mass Passion

ఈ సారి సంక్రాంతిని మాస్ ఘాటుతో నింపేందుకు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు రెడీ అయిపోయారు. మహేశ్ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరు కారం ఈనెల 12న సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాలతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 13 ఏళ్ల త‌ర్వాత ఈ క్రేజీ కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాపై.. విప‌రీత హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ రేసులో చాలా సినిమాలు ఉండ‌టంతో ఒక‌వేళ వాయిదా ప‌డుతుందా? అన్న సందేహం ఓవైపు ఉండేది. కానీ ఆ ఛాన్సే లేదంటూ తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌వ్వ‌డంతో రిలీజ్ తేలిపోయింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ సినిమాకు.. మేకర్స్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలనూ జోరుగా నిర్వహిస్తున్నారు.. ఈ చిత్రానికి బోర్డు U/A సర్టిఫికెట్ ను ఇచ్చింది సెన్సార్ బోర్డు.. ఇక‌.. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రం రన్ టైమ్ విషయానికొస్తే.. 2 గంటల 42 నిమిషాల నిడివి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం చివరి 45 నిమిషాలు వేరే లెవల్లో ఉంటుందని ఇప్పటికే నిర్మాత హైప్ పెంచారు. మ‌హేష్ అన్న ఖాతాలో మ‌రో మాస్ హిట్ ఖాయ‌మంటూ అభిమానులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా ఘాటెక్కించేస్తున్నారు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడంతో ప్రమోషన్స్ ను మరింత జోరుగా నిర్వహించనున్నారు యూనిట్. ఇప్పటి వరకు గ్లింప్స్, సాంగ్స్ హోరెత్తించేస్తున్నాయి. నెక్ట్స్ రాబోయే టీజర్, ట్రైలర్ కోసం బాబు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా హీరోయిన్ కావ‌డం ఫ్యాన్స్‌కు మ‌రింత కిక్ ఇస్తోంది. రీసెంట్ గా వచ్చిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ లో ఈ జోడీ రేపిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.. మ‌హేష్ బాబు కూడా చాలా కాలం త‌ర్వాత ఊర‌ మాస్ స్టెప్పులు వేయ‌డంతో.. థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్‌కు పూన‌కాలు రావ‌డం ఖాయ‌మంటున్నారు. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి న‌టిస్తుండ‌గా.. థ‌మ‌న్ మ్యూజిక్‌కు ఇప్ప‌టికే ఫ్యాన్స్ బాగా క‌నెక్ట్ అయ్యారు. అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చే ముందు మ‌హేష్ బాబు ఊర‌మాస్ హిట్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఎలా ఊపేస్తారన్న‌ది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.