Natinoal Cruesh : నేషనల్ క్రష్

నెటిజ‌న్ల దృష్టంతా ఆ ముగ్గురి పైనేసోష‌ల్ మీడియాలో ముగ్గురు సెల‌బ్రిటీల పేర్లు మార్మోగిపోతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌నాల‌కు ఓ మోస్త‌రుగా తెలిసిన ఆ ముగ్గురు ఇప్పుడు ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చేసారు. గత మూడు నెలులుగా సోష‌ల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయారు. నెటిజన్లు వాళ్ల డిటైల్స్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2024 | 11:30 AMLast Updated on: Mar 12, 2024 | 11:30 AM

Three Celebrities Have A National Crush On Social Media

నెటిజ‌న్ల దృష్టంతా ఆ ముగ్గురి పైనేసోష‌ల్ మీడియాలో ముగ్గురు సెల‌బ్రిటీల పేర్లు మార్మోగిపోతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌నాల‌కు ఓ మోస్త‌రుగా తెలిసిన ఆ ముగ్గురు ఇప్పుడు ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చేసారు. గత మూడు నెలులుగా సోష‌ల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయారు. నెటిజన్లు వాళ్ల డిటైల్స్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవ‌రంటే.. యానిమ‌ల్ మూవీలో జోయాగా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన త్రిప్తి దిమ్రి, ట్వెల్త్ ఫెయిల్ మూవీ హీరోయిన్ మేధా శంక‌ర్, అంబానీ ఇంటికి కాబోయే కోడ‌లు రాధికా మ‌ర్చంట్.. ఇప్ప‌టి వ‌రకూ నేష‌న‌ల్ క్ర‌ష్‌గా ఈ ముగ్గురు టాలెంటెడ్ బ్యూటీస్ ఇప్పుడు నేష‌న‌ల్ లెవెల్‌లో హెడ్‌లైన్ టాపిక్‌గా మారారు.

యానిమల్‌’ తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది బాలీవుడ్‌ (Bollywood) నటి త్రిప్తిడిమ్రి.. సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. జోయాగా తెగ ఫేమస్ అయింది. కుర్ర‌కారుకు క‌ల‌ల‌రాణిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత నేషనల్ క్రష్ అయిపోయిందీ బ్యూటీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రిప్తి గురించి నెటిజన్లు ఓ రేంజ్‌లో సెర్చ్ చేశారు. దీంతో బ్యూటీ త్రిప్తి క్రేజ్ విప‌రీతంగా పెరిగిపోవడంతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది. ఒక్క మూవీతో స్టార్ స్టేటస్ ను అనుభవించడంతో పాటు బాలీవుడ్ లోనూ తెలుగులోనూ అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. విజయ్‌ దేవరకొండ – గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్‌లో త్రిప్తి హీరోయిన్‌గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

’12 త్ ఫెయిల్’ (12th Fail Movie) చిత్రంతో వెలుగులోకి వ‌చ్చిన హీరోయిన్ మేధా శంక‌ర్. ఈ సినిమాకి అవార్డులు వ‌రించడంతో అమ్మ‌డి పేరు నెట్టింట మారుమ్రోగుతోంది. ఈసినిమా కంటే ముందు మూడు సినిమాల్లో న‌టించింది. కానీ ఏ సినిమా తీసుకుని రాని గుర్తింపును ట్వెల్త్ ఫెయిల్ తీసుకురాడంతో మేధా శంక‌ర్ ఒక్క‌సారిగా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా ఐపీఎస్ అధికారి మ‌నోజ్ కుమార్ శ‌ర్మ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించారు. ఇందులో మేధ ఆయ‌న సతీమ‌ణి పాత్ర‌లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. దీంతో.. ఎవ‌రీ మేధా శంక‌ర్ అంటూ సెర్చింగ్ పెద్ద ఎత్తునే జ‌రిగింది. దీంతో అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ విప‌రీతంగా పెరిగిపోయింది. అలాగే ఈ బ్యూటీకి చిన్న నాటి నుంచి సంగీతమంటే ఇష్ట‌మ‌ట‌. హిందుస్తానీ సంగీతంలో ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ కూడా తీసుకుందిట‌. సితార‌.. హ‌ర్మోనియం.. కీబోర్డ్ కూడా ప్లే చేస్తుందిట‌. ఈ బ్యాక్‌గ్రౌండ్‌తోనే 12 త్ ఫెయిల్ లో స్వ‌యంగా ఓ పాట కూడా ఆల‌పించింది. మొత్తానికి మేధా కూడా సోష‌ల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా మారిపోయింది.

ఇక రాధికా మ‌ర్చంట్.. అంబానీల ఇంటికి కాబోయే కోడ‌లిగా ఈ చిన్న‌దాని పేరు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. అనిల్ అంబానీ- రాధికా మ‌ర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు చూశాక‌.. జ‌నాలు ఎవ‌రీ రాధికా మ‌ర్చంట్ అంటూ సోష‌ల్ మీడియా మీద దండ‌యాత్ర చేశారు. అనంత్ అంబానీని పెళ్లాడుతున్న ఆ అంద‌మైన యువ‌తి ఎవ‌రు… త‌న బ్యాక్ గ్రౌండ్ ఏంటి… అంటూ సోష‌ల్ మీడియాలో తెగ సెర్చ్ చేశారు. ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వీరెన్ మర్చంట్- షైలా మర్చంట్ ఏకైక కుమార్తె రాధికా మ‌ర్చంట్.. వీరెన్ మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సంస్థ సీఈఓగా ఉన్నారు. రాధికా మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక‌.. ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల్లో త‌న కాబోయే అత్త‌వారింటికి త‌గ్గ‌ట్లుగా రాధికా త‌న రిచ్‌నెస్ లుక్స్‌తో హాట్‌టాపిక్‌గా నిలిచారు. అంబానీల ఫ్యామిలీ స్టేట‌స్‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని విధంగా రాధిక ధ‌రించిన డ్రెస్సులు, న‌గ‌లు, యాక్సెస‌రీస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో.. సోష‌ల్ మీడియా మొత్తం రాధికా మ‌ర్చంట్ పేరు మార్మోగిపోయింది. మొత్తానికి గ‌త మూడు నెల‌ల కాలంలో ముగ్గురు ముద్దుగుమ్మ‌లు సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ అయిపోయారు.