Tollywood: టాలీవుడ్‌ ఇండస్ట్రీని భయపెడుతున్న స్టార్స్ హెల్త్ ఇష్యూస్..!

తెలుగు స్టార్స్‌కి వరుసగా అనారోగ్య సమస్యలు తలెత్తటం ఇండస్ట్రీ పెద్దలని కూడా కంగారు పెట్టిస్తోంది. గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కరోనా సైడ్ ఎఫెక్ట్స్‌తో ఫుడ్ అలర్జీ వచ్చింది. ఇలా మహేశ్, సమంత తర్వాత చిరు, ప్రభాస్ వంటి స్టార్స్‌కు ఆనారోగ్య సమస్యలు క్యూ కడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 05:18 PMLast Updated on: Aug 16, 2023 | 5:18 PM

Tollywood Actors Facing Health Issues Causes Havoc In Film Industry

Tollywood: టాలీవుడ్‌కి ఏమైంది..? నిన్న చిరు మోకాలి వాష్ సర్జరీ అన్నారు. అంతకుముందు సమంత మయో సైటిస్‌తో బాధపడిందన్నారు. ఇప్పటికీ తను ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. కోలుకునేందుకు ఏడాది బ్రేక్ తీసుకునే పనిలో ఉంది. ఇంతలో రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలికి, వెన్ను నొప్పికి సర్జరీనే మార్గమని తెలుస్తోంది. తెలుగు స్టార్స్‌కి వరుసగా అనారోగ్య సమస్యలు తలెత్తటం ఇండస్ట్రీ పెద్దలని కూడా కంగారు పెట్టిస్తోంది. గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కరోనా సైడ్ ఎఫెక్ట్స్‌తో ఫుడ్ అలర్జీ వచ్చింది. పచ్చి కాయగూరలు, పండ్లూ తిని 4 నెలలు పత్యం చేయాల్సి వచ్చింది.

ఒక ట్రీట్ మెంట్‌కి పడే మెడిసిన్స్ మరో అనారోగ్య సమస్యను పెద్దది చేయటంతో సర్కారు వారి పాట షూటింగ్ టైంలోచాలా ఇబ్బంది పడ్డాడు మహేశ్. బక్కచిక్కాడు కూడా. ఇలా మహేశ్, సమంత తర్వాత చిరు, ప్రభాస్ వంటి స్టార్స్‌కు ఆనారోగ్య సమస్యలు క్యూ కడుతున్నాయి. ఫ్యాన్స్‌ని కంగారు పెట్టేలా చేస్తున్నాయి. ఓ స్టార్ హీరోకి అనారోగ్య సమస్య అంటే, ఇండస్ట్రీనే స్థంబిస్తుంది. స్టార్ హీరో రాకపోతే షూటింగ్ ఉండదు. మిగతా స్టార్ కాస్ట్ కి పని ఉండదు. అలాంటిది అరడజన్ హీరోలకు ఒకేసారి అనారోగ్య సమస్య వస్తే ఇండస్ట్రీ ఫ్రీజ్ అయిపోతుంది.

నిజానికి చిరు, ప్రభాస్ ఫేస్ చేస్తున్న మోకాలినొప్పి, వెన్ను నొప్పి లాంటి సమస్యలు మాస్ మహారాజా రవితేజకి కూడా రాజా ది గ్రేట్ టైంలోనే వచ్చాయట. ఆయుర్వేదిక్ మందులు, ఫిజియోథెరపీతో నెట్టుకొస్తున్న తను, సర్జరీ వైపు మాత్రం అడుగులు వేయలేదని తెలుస్తోంది. ఏదేమైనా కట్టకట్టకుని తెలుగు స్టార్లకే అనారోగ్య సమస్యలు రావటం ఇండస్ట్రీని కంగారు పడేలా చేస్తోంది.