TRISHA: చిరంజీవి తర్వాత వెంకీ, నాగ్, బాలయ్యతో జోడీ కన్ఫామ్

మెగాస్టార్‌తో 2006లో స్టాలిన్ మూవీలో మెరిసిన త్రిష 2024లో.. అంటే 18 ఏళ్ల తర్వాత విశ్వంభరలో జోడీ కట్టింది. ఇక 2008లో నాగార్జునతో కింగ్ మూవీ చేసిన త్రిష, ఇప్పుడు కొత్త సినిమా కోసం మన్మథుడితో మళ్లీ జోడీ కడతానంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 05:26 PMLast Updated on: Feb 22, 2024 | 5:26 PM

Trisha Is The Only Leading Pair To Top Stars Like Chiranjeevi Kamal Haasan

TRISHA: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నటసింహం బాలయ్య, విక్టరీ వెంకటేష్ ఈ నలుగు టాలీవుడ్ పిల్లర్స్‌కి బేస్‌మెంట్‌గా మారుతోంది సీనియర్ హీరోయిన్ త్రిష. నిజమే.. ఈ 40 ప్లస్ హీరోయిన్, ఈ 60 ప్లస్ హీరోలకు కామన్ జోడీగా మారింది. అది కూడా వీళ్లందరితో పుష్కర కాలం క్రితం జోడీ కట్టి.. ఇప్పుడు కాంబినేషన్‌ని రిపీట్ చేస్తోంది. మెగాస్టార్‌తో 2006లో స్టాలిన్ మూవీలో మెరిసిన త్రిష 2024లో.. అంటే 18 ఏళ్ల తర్వాత విశ్వంభరలో జోడీ కట్టింది.

Upasana Kamineni: ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నా..!

ఇక 2008లో నాగార్జునతో కింగ్ మూవీ చేసిన త్రిష, ఇప్పుడు కొత్త సినిమా కోసం మన్మథుడితో మళ్లీ జోడీ కడతానంటోంది. 2010లో నమో వెంకటేశ మూవీలో వెంకటేష్‌తో జోడీకట్టిన త్రిష, ఇప్పుడు అనిల్ రావిపుడి తీసే సినిమాలో వెంకీతో కలిసి కాంబినేషన్ రిపీట్ చేస్తోంది. ఇక బాలయ్యతో లయన్ అంటూ 2015‌లో జోడీ కట్టింది. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. కాని ఈ కాంబినేషన్‌ని రిపీట్ చేసే బాధ్యత బోయపాటి మీద పడినట్టుంది. బోయపాటితో బాలయ్య చేయబోయే సినిమాకు త్రిషనే హీరోయిన్ అంటున్నారు.

అలా అయితే టాలీవుడ్‌కి నాలుగు స్థంభాల్లాంటి సీనియర్లందరికీ త్రిషనే కామన్ జోడీ అనుకోవాల్సి వస్తోంది. కోలీవుడ్‌లో కూడా లియోతో హిట్ మెట్టెక్కిన త్రిష, అక్కడ లోకనాయకుడు కమల్ హాసన్‌తో కూడా జోడీ రిపీట్ చేసింది. 2010లో మన్మథ భాణంలో కలిసి నటించిన కమల్, త్రిష జోడీ 14 ఏళ్ల తర్వాత మణిరత్నం మూవీ థగ్ లైఫ్‌లో రిపీట్ కాబోతోంది.