Urvashi Rautela: అందాల ఊర్వశి.. వివాదాల ప్రేయసి..

ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది ఊర్వశి. గతంలో టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌తో రిలేషన్‌షిప్‌ వ్యవహారంలో ఆమె పేరు బాగా నానింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 5, 2023 | 06:57 PMLast Updated on: Sep 05, 2023 | 6:57 PM

Urvashi Rautela Trolled For Sharing Pak Player Naseem Shahs Photo

Urvashi Rautela: ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యన తెలుగు సినిమాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య, అక్కినేని అఖిల్‌ ఏజెంట్‌, పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ తో టాలీవుడ్‌ ఆడియెన్స్‌ను అలరించిందామె.

అయితే ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది ఊర్వశి. గతంలో టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌తో రిలేషన్‌షిప్‌ వ్యవహారంలో ఆమె పేరు బాగా నానింది. ప్రస్తుతం పాకిస్థాన్‌, శ్రీలంక వేదికగా ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2023 క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టోర్నీలో భాగంగా శనివారం భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. అయితే భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ హీరోయిన్‌ ఊర్వశి రౌతెలా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పాకిస్థాన్ బౌలర్ నసీమ్ షా ఫోటోను స్టేటస్‌గా పెట్టుకుంది.

దీంతో ఊర్వశి పోస్ట్‌ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరలైంది. ఇండియా, -పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా జిమ్‌లోని టీవీ ఫోటోను ఊర్వశి షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో పాక్ బౌలర్ నసీమ్ షా బాగా హైలైట్ అయ్యాడు. ఈ ఫోటోకు ‘వర్కౌట్ టైమ్’ అని క్యాప్షన్ పెట్టింది ఊర్వశి. కావాలనే ఈ ఫొటోను పోస్ట్ చేసిందని నెటిజన్లు ఊర్వశిపై మండిపడుతున్నారు. కాగా ఊర్వశి ఇలా వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. 2022 దుబాయ్‌ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీ జరుగుతున్నప్పుడు కూడాఇలాగే నసీమ్ షా ఫొటోను షేర్‌ చేసి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.