Pawan kalyan : శివరాత్రికి వీరమల్లు ఫీస్ట్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు ఒకటి.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్‌ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, పవన్ లుక్‌ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2024 | 09:38 AMLast Updated on: Mar 07, 2024 | 9:38 AM

Veeramallu Feast For Shivaratri

 

 

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు ఒకటి.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్‌ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, పవన్ లుక్‌ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. అయితే.. ఈ చిత్రం షూటింగ్ ఆగి చాలా కాలమే అయ్యింది. దీంతో.. మేకర్స్ టైమ్‌ దొరికినప్పుడల్లా ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ రూమర్స్‌కు చెక్ పెడుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్రేమో అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది.

ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ప్రోమోని శివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ చేయబోతున్నారంటూ ఆ మధ్య ఒక న్యూస్ బాగా వైరల్ అయ్యింద. ఇక అదే ప్రోమోతో రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారంటూ టాక్ వినిపించింది. దీంతో.. ఆ వార్త నెట్టింట వైరల్ గా మారింది. పవర్‌ స్టార్ అభిమానులూ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇపుడు సమయం దగ్గరకి వస్తుంది. కానీ.. మేకర్స్‌ నుంచి ప్రోమోపై ఎలాంటి అప్‌డేట్ కనిపించడం లేదు. దీంతో.. ప్రోమో రిలీజ్ ఉందా లేదా అన్న విషయంపై ఫ్యాన్స్‌ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈరోజైనా మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఆల్రెడీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో.. పవన్ కల్యాణ్ బంధిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి.. ఈ శివరాత్రికి పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కు వీరమల్లు ఫీస్ట్ ఇస్తాడో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే..