Gold Mine Collapse : బంగారు గని కూలి.. 12 మంది మృతి..

ఇండోనేషియాలోని జకర్తాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 8, 2024 | 03:10 PMLast Updated on: Jul 08, 2024 | 3:10 PM

12 Dead In Gold Mine Collapse

 

 

ఇండోనేషియాలోని జకర్తాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున్న అక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ఓ బంగారు గని కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 20 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

కాగా గతంలో కూడా ఇండోనేషియాలో అక్రమ తవ్వకాలు జరుపుతుండగా బంగారం గని కూలడంతో అప్పడు కూడా 12 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా ఈ ఘటనలో మరణించి వారిలో అందరు కూడా మైనర్లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో దాదాపు 10 నుంచి 30 మీటర్ల లోతున కార్మీకులు కూరుకుపోయినట్లు గుర్తించారు. కాగా వరందరు కూడా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు 2024 జరిగిన ప్రమాదంలో మృతులకు గల కారణాలు ఇంక తెలియలేదు.