బెజవాడ: 500 టికెట్ కు గంటన్నర 300 టికెట్ కు 15 నిమిషాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. 500 టికెట్ల విషయంలో భక్తులు ప్రదర్శిస్తున్న వైఖరి చూసి అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 5, 2024 | 03:54 PMLast Updated on: Oct 05, 2024 | 3:54 PM

500 Hundred Tickets In Line For An Hour And A Half Darshan

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. 500 టికెట్ల విషయంలో భక్తులు ప్రదర్శిస్తున్న వైఖరి చూసి అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ సృజనా, సిపి రాజశేఖర్ బాబు క్యూ లైన్లను పరిశీలించిన అనంతరం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. భక్తులకు దర్శన ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేస్తున్నాము అన్నారు. ఎక్కువమంది భక్తులు 500 రూపాయల టికెట్లు తీసుకుంటున్నారు అని తెలిపారు.

500 వందల టికెట్లు లైన్ లో గంటన్నర సమయం దర్శనానికి పడుతుందన్నారు. 300 రూపాయల టికెట్ లైన్ లో దర్శనం 15 నిమిషాలు పడుతుంది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 300 రూపాయల టికెట్ల లైను ఖాళీగా ఉంటుంది కాబట్టి భక్తులు 300 టికెట్లు తీసుకుంటే త్వరగా దర్శనం అవుతుంది అని ఆయన సూచించారు. వీఐపీలు, వివిఐపీలు వారికి కేటాయించిన స్లాట్లలో దర్శనానికి వస్తే మంచి దర్శనం అందించగలుగుతాం అని ఆయన స్పష్టం చేసారు.