New Virus: రక్త కన్నీరు పెట్టించే సరికొత్త వైరస్.. ఫ్రాన్స్ – స్పెయిన్ సరిహద్దుల్లో కలకలం

కళ్లలో నుంచి రక్తస్రావం కలిగించే సరికొత్త వ్యాధి ఫ్రాన్స్ లో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరమైన వైరస్ గా పరిగణించారు వైద్యనిపుణులు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గా దీనికి పేరు పెట్టారు. ఇది ఒకరకమైన పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని నిర్థారించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 29, 2023 | 07:45 AMLast Updated on: Oct 29, 2023 | 7:45 AM

A New Virus Called Crimean Congo Hemorrhagic Fever Is Causing A Stir In Spain And France

మన్నటి వరకూ కరోనా లాంటి వైరస్ లతో తీవ్ర ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫ్రాన్స్ లో కళ్ల నుండి రక్తస్రావం జరిగే వైరల్ ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. ఇది ఒకరకమైన పురుగుల ద్వారా వ్యాప్తిస్తుందని కనుగొన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దుల్లో వెలుగులోకి వచ్చింది. దీంతో బ్రిటన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో సంచరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తమ దేశ పౌరులకు సూచించింది బ్రిటన్ ప్రభుత్వం.

ఈ క్రిమి అత్యంత ప్రాణాంతకం..

క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే ఏంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎబోలా జాతి వైరస్ కు సంబంధించిన వ్యాధి. ఆఫ్రికా, పశ్చిమాసియాతో పాటూ ఐరోపా దేశాల్లో అధికంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఒక్కో సారి స్పెయిన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి , ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దుల్లో ఉన్న ఈ వైరస్ రానున రోజుల్లో బ్రిటన్ కు కూడా వ్యాప్తి చెందవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని తీవ్రత దృష్ట్యా ఈ ఏడాదికి సంబంధించిన తీవ్ర వ్యాధుల జాబితాలో చేర్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వైరస్ హయలోమా మార్గినాటమ్ అనే పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధి సోకిన వారి శరీర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు.

వ్యాధి లక్షణాలు – నివారణా మార్గాలు

ఈ వ్యాధి సోకిన వారిలో ముందుగా ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. ముందుగా కండరాల నొప్పులు, గొంతు, తల నొప్పి, వాంతులు, కడుపు మంటతో పాటూ నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి ముదిరేకొద్దీ లక్షణాలు తీవ్ర రూపం దాలుస్తాయి. ముక్కు, కళ్లు, చర్మంలోని రక్తనాళాలు పగిలి వాటి నుంచి రక్తస్రావం జరుగవచ్చు. జ్వరం, కళ్లు తిరగడం, మెడ, వెన్ను నోప్పి తీవ్రంగా ఉంటుంది. చివరి దశలో కళ్లు ఎర్రగా మారడం, చిన్న పాటి వెలుగును కూడా చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ వైరస్ కి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. రోగి శరీరంలోని రోగనిరోధక శక్తి ద్వారానే వ్యాధితో పోరాడి చికిత్స అందించే విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి బారిన పడిన బాధితుల్లో 10 నుంచి 40 శాతం మంది మాత్రమే చనిపోయినట్లు తెలిసింది.

 

T.V.SRIKAR