కొండక్కను వదలను: నాగార్జున కీలక నిర్ణయం

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంలో అక్కినేని నాగార్జున సీరియస్ గానే ఉన్నారు. దీనిపై కోర్ట్ కి వెళ్ళాలి అని నాగార్జున భావిస్తున్నట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 3, 2024 | 12:36 PMLast Updated on: Oct 03, 2024 | 12:36 PM

Akkineni Nagarjuna Sent Legal Notice To Konda Surekha

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంలో అక్కినేని నాగార్జున సీరియస్ గానే ఉన్నారు. దీనిపై కోర్ట్ కి వెళ్ళాలి అని నాగార్జున భావిస్తున్నట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు నాగార్జున. ఇప్పటికే దీనిపై అక్కినేని ఫ్యామిలీ మొత్తం రియాక్ట్ అయింది.

ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున స్పష్టం చేసారు. ఇక దీనిపై ఇప్పటికే సినిమా ప్రముఖులు అందరూ స్పందిస్తున్నారు. అటు కేటిఆర్ కూడా లీగల్ నోటీసులు పంపారు.