Bangalore Rev Party : బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరు!?

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరల్లోని ఓ ఫాం హౌస్‌ లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారు..? అనేది తెలియలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 22, 2024 | 12:18 PMLast Updated on: May 22, 2024 | 12:19 PM

Bangalore Rev Party

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరల్లోని ఓ ఫాం హౌస్‌ లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. రేవ్ పార్టీ లో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా గుర్తించారు. వన్ టౌన్ కొత్తపేటలోని ఆంజనేయవాగుకు చెందిన వ్యక్తి వాసు. విజయవాడలో అతి పెద్ద బుకీల నెట్‌వర్క్‌ను వాసు విస్తరించాడు. పైకి వ్యాపారం, ఫార్మా రంగాల పేర్లు వాడుకుంటున్నాడనీ… డీజీపీ ఆఫీసులో కొందరు అధికారుల పేర్లను వాసు ఉపయోగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్‌లతో పాటు డ్రగ్స్ వ్యవహారంలోనూ వాసు కీలక సూత్రధారి. విజయవాడలోని గాంధీనగర్‌లో తన స్నేహితుడితో కలిసి 6 కోట్లతో ఒక స్థలం కొన్నాడు. బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఏపీ పోలీసుల నంబర్లు ఉండటంతో లోతుగా విచారణ చేస్తున్నారు. వాసు దందాలకు కొందరు పోలీసులు అండగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున ఈ రేవ్‌ పార్టీ జరిగింది. దీనికి దాదాపు 150 మంది వరకు హాజరయ్యారు. పార్టీ నిర్వాహకుడు వాసుతోపాటు అరుణ్, సిద్దికి, రన్‌దీర్, రాజ్ భవ్‌ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. సిద్దిఖీ, రన్‌దీర్, రాజ్‌భవ్‌ డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసులు FIR నమోదు చేశారు. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డిది. రేవ్‌ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు కూడా దొరికింది. ఈ ఆరోపణలను కాకాణి ఖండించారు. పార్టీలో తెలుగు రాష్టాల వాళ్ళే ఎక్కువ మంది. తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. కన్నడ సీరియల్‌ నటులతోపాటు 20 మందికిపైగా మోడల్స్‌ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ సినీ ప్రముఖులు ఎవరన్నది మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఘటనా స్థలంలో 17 గ్రాముల MDMA, కొకైన్‌తోపాటు 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఈవెంట్‌ కోసం ఫౌంహౌస్‌ నిర్వాహకులకు 30 నుంచి 50 లక్షల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారు..? అనేది తెలియలేదు. మెడికల్‌ టెస్టుల తర్వాత ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో బయటపడే అవకాశముంది.