ఏపీలో ఆ ఊర్లో బైక్ పెడితే అంతే సంగతులు…!

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వరుసగా జరుగుతున్న బైకు దొంగతనాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళం వేసి ఉన్న బైకులను కూడా చాకచక్యంగా అపహరించుకుపోతున్నారు కేటుగాళ్లు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 11, 2024 | 05:53 PMLast Updated on: Sep 11, 2024 | 5:53 PM

Bike Robers In Palnadu District

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వరుసగా జరుగుతున్న బైకు దొంగతనాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళం వేసి ఉన్న బైకులను కూడా చాకచక్యంగా అపహరించుకుపోతున్నారు కేటుగాళ్లు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని మరి దొంగతనాలు చేస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ ,ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఇప్పటివరకు 20 బైకుల వరకు పోయినట్టుగా బాధితులు ఫిర్యాదులు చేసారు.

సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతున్నా సరే లెక్కచేయకుండా దొంగతనాలు చేస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చినా కూడా ఫలితం శూన్యం అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీస్ అధికారులు తమ బైక్స్ ని కాపాడాలని, పోయిన బైక్స్ ని బాధితులకు అందించాలి అని కోరుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేని కలిసి తమ ఆవేదన చెప్పాలని భావిస్తున్నారు.