బ్రేకింగ్: తిరుమలలో ప్రమాణం చేస్తున్న వైసీపీ

తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2024 | 02:26 PMLast Updated on: Sep 23, 2024 | 2:26 PM

Breaking Ycp Taking Oath In Tirumalabreaking Ycp Taking Oath In Tirumala

తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ రాజకీయ భవిష్యత్తుకే ఈ వ్యవహారం ప్రమాదకరంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రమాణం చేసేందుకు వైసీపీ సిద్దమైంది.

నేడు మద్యాహ్నం 3:30 తిరుమల కు రానున్న మాజీ టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి… గత కొద్దికాలం గా తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీ పై ఆలయం ముందు ప్రమాణం చెయ్యనున్నారు. పుష్కరిణి లో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద స్వామివారి కి కర్పూర నీరాజనం అందిస్తారు. తన పదవీ కాలంలో ఎలాంటి తప్పులు జరగలేదని ప్రమాణం చెయ్యనున్నారు.