Pakistan valley Bus accident : పాకిస్థాన్ లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి..

భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లో బలూచిస్థాన్ నుంచి ప్రావిన్స్ లోని వాషుక్ జిల్లాలకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాద వస్థాత్తు లోయ పడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 29, 2024 | 03:00 PMLast Updated on: May 29, 2024 | 3:00 PM

Bus Fell In Pakistan Valley 28 People Died

భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లో బలూచిస్థాన్ నుంచి ప్రావిన్స్ లోని వాషుక్ జిల్లాలకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాద వస్థాత్తు లోయ పడిపోయింది.

ఈ ప్రమాద ఘటనలో 28 మంది మృతి చెందారు. మరో 22 మందికి గాయాలపాలయ్యారు. బస్సు ముందు టైర్ పేలడంతో బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కాగా ఇటీవల కాలంలో పాకిస్థాన్ లో ఘోర బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్థాన్ లో వరుసగా ఇది నాలుగో బస్సు ప్రమాదం.. కాగా ఈ నెల ప్రారంభంలోనే మే 3న వాయువ్య పాకిస్థాన్‌లో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పర్వత ప్రాంతం నుండి జారిపడి లోయలో పడటంతో దాదాపు 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మరువక ముందే మరో బస్సు ప్రమాదం చోటు జరిగింది. కాగా అప్పటి బస్సు ప్రమాదంతో పోలిస్తే.. నేడు జరిగిన ప్రమాదపు మరణాలు మరింతగా పెరిగాయి.