Cancer Tablet @100Rupees : క్యాన్సర్ వ్యాపించకుండా రూ. 100ల ట్యాబ్లెట్

క్యాన్సర్ (Cancer) ఓ మహమ్మారి. ఒక్కసారి ఎటాక్ అయితే ప్రాణాలు తీసేస్తుంది. అయితే కీమో, రేడియేషన్‌ లాంటి చికిత్సలతో క్యాన్సర్‌ నయం చేయించుకున్నా... మళ్లీ తిరగబెట్టకుండా అడ్డుకునే మాత్ర ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కేవలం 100 రూపాయలు ఖర్చుతో ఆ టాబ్లెట్ వేసుకుంటే... మళ్ళీ శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి అయ్యే అవకాశం లేదంటున్నారు పరిశోధకులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 12:06 PMLast Updated on: Feb 29, 2024 | 12:06 PM

Cancer Does Not Spread Rs 100s Tablet

క్యాన్సర్ (Cancer) ఓ మహమ్మారి. ఒక్కసారి ఎటాక్ అయితే ప్రాణాలు తీసేస్తుంది. అయితే కీమో, రేడియేషన్‌ లాంటి చికిత్సలతో క్యాన్సర్‌ నయం చేయించుకున్నా… మళ్లీ తిరగబెట్టకుండా అడ్డుకునే మాత్ర ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కేవలం 100 రూపాయలు ఖర్చుతో ఆ టాబ్లెట్ వేసుకుంటే… మళ్ళీ శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి అయ్యే అవకాశం లేదంటున్నారు పరిశోధకులు.

ముంబైలోని ప్రముఖ క్యాన్సర్‌ పరిశోధన సంస్థ ‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ శాస్త్రజ్ఞులు క్యాన్సర్ వ్యాప్తి కాకుండా ఓ టాబ్లెట్ ను రూపొందించారు. దీనికోసం ఎన్నో యేళ్ళుగా పరిశోధనలు చేస్తున్నట్టు సీనియర్‌ క్యాన్సర్‌ సర్జన్‌ డాక్టర్‌ రాజేంద్ర బడ్వే తెలిపారు. ప్రయోగాల్లో భాగంగా కొన్ని ఎలుకల శరీరాల్లోకి.. మానవ క్యాన్సర్‌ కణాలను చొప్పించారు. ఆ ఎలుకల్లో క్యాన్సర్‌ కణితులు ఏర్పడ్డాక వాటిని రేడియేషన్‌, కీమో థెరపీతో, సర్జరీ ద్వారా తొలగించారు. ఆ చికిత్సలతో క్యాన్సర్‌ కణాలు చనిపోయినా… సెల్‌ ఫ్రీ క్రోమాటిన్‌ పార్టికల్స్‌ అనే చిన్నచిన్న తునకలుగా మారిపోయాయి. ఆ పార్టికల్స్‌ రక్తప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు అంటుకునే ఛాన్సుంది. అప్పుడు ఆరోగ్యవంతమైన కణాల్లోకి ప్రవేశించి వాటిని మళ్ళీ క్యాన్సర్‌ కణాలుగా మారుస్తాయన్నారు డాక్టర్ రాజేంద్ర.

ఎలుకలకు రెజర్వెట్రాల్‌, కాపర్‌ (ఆర్‌+సీయూ)తో కూడిన ప్రో-ఆక్సిడెంట్‌ ట్యాబ్లెట్లు (Cancer Tablet) ఇచ్చారు. ఈ ట్యాబ్లెట్స్ కడుపులో ఆక్సిజన్‌ రాడికల్స్‌ను ఉత్పత్తి చేశాయి. ఆక్సిజన్‌ రాడికల్స్‌ కూడా రక్తప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశించి.. ఎక్కడ సెల్‌ ఫ్రీ క్రోమాటిన్‌ పార్టికల్స్‌ కనిపించినా వాటిని నాశనం చేశాయి. ఈ ట్యాబ్లెట్‌ క్యాన్సర్‌ తిరగబెట్టకుండా కాపాడటంలో 30 శాతం ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటున్నారు సైంటిస్టులు. కీమోథెరపీ దుష్ప్రభావాల నుంచి కూడా 50శాతం దాకా రక్షణ ఇస్తుందన్నారు. మ్యాజిక్‌ FR+CU పేరుతో ట్యాబ్లెట్ పై ప్రజెంటేషన్ ఇస్తున్నారు. జూన్‌, జూలై నుంచి ఈ టాబ్లెట్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సామాన్యులకు భారం లేకుండా రూ.100కే అందుబాటులోకి వస్తుందని డాక్టర్‌ రాజేంద్ర చెప్పారు.