కోహ్లీ రికార్డుపై కన్నేసిన స్కై ఢిల్లీ మ్యాచ్ లో కొట్టేస్తాడా ?
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20లో సూర్య మరో 39 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా విరాట్ కోహ్లితో సమంగా నిలుస్తాడు.

Suryakumar Yadav, of India, hits 4 during the third T20I match between West Indies and India at Warner Park in Basseterre, Saint Kitts and Nevis, on August 2, 2022. (Photo by Randy Brooks / AFP) (Photo by RANDY BROOKS/AFP via Getty Images)
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20లో సూర్య మరో 39 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా విరాట్ కోహ్లితో సమంగా నిలుస్తాడు. కోహ్లి 73 మ్యాచ్ల్లో ఈ ఘనత అందుకోగా.. సూర్యకుమార్ కూడా ఢిల్లీ టీ20లో 39 పరుగులు చేస్తే సరిగ్గా 73 మ్యాచ్ల్లోనే అందుకుంటాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజం అగ్రస్ధానంలో ఉన్నాడు. బాబర్ 67 మ్యాచ్ల్లోనే 2500 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. మరో పాక్ క్రికెటర్ రిజ్వాన్ 76 మ్యాచ్ లలోనూ, ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ 78 ఇన్నింగ్స్ లలోనూ ఈ రికార్డును అందుకున్నారు.